కొన్ని రోజుల క్రితం వరకు ఎవరికీ పెద్దగా తెలియని కమలా హారిస్ అమెరికా ఉపాధ్యక్ష రేసులో నిలబడి వార్తల్లో నిలిచారు.జో బిడెన్ తాజాగా కాలిఫోర్నియా సెనెటర్ కమలా హారిస్ ను డెమోక్రాట్ల తరపున ఉపాధ్యక్ష పదవికి ను ఎంపిక చేసినట్టు ప్రకటించారు.
గత కొన్ని నెలలుగా ఉపాధ్యక్ష పదవి కోసం ఎవరిని ఎంపిక చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్న బిడెన్ తాజాగా కమల్ హారిస్ పేరును ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.భారత సంతతికి చెందిన ఈమె ఇప్పటివరకు తన దోశ వేయడం కూడా తెలీదని చెబుతున్నారు.
తాజాగా కమలా హారిస్ దక్షిణ భారతదేశ వంటకమైన దోశను వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అమెరికన్ నటి, టీవీ పర్సనాలిటీ మిండీ కాలింగ్ తో కలిసి కమలా హారిస్ లాస్ ఏంజెల్స్లోని కాలింగ్ నివాసంలో తమిళనాడు ముచ్చట్ల గురించి మాట్లాడుకుంటూ దోశ వేసిన వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
దోశ పిండి కలుపుతూ తాను గతంలో ఎప్పుడూ దోశ వేయలేదని కమలా హారిస్ పేర్కొన్నారు.
గతంలో పలు సందర్భాల్లో కమలా హారిస్ తమిళనాడు ఇడ్లీ సాంబార్ అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు.
కమలా హారిస్ తల్లి శ్యామలా గోపాలన్ తమిళనాడుకు చెందిన వారు.ఆమె తండ్రి జమైకా నుంచి అమెరికాకు వచ్చి స్థిరపడ్డారు.
ఆమె ఉపాధ్యక్ష రేసులో నిలిచిన రోజు నుంచి సోషల్ మీడియాలో ఆమె గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది.అగ్రరాజ్యంలో ఉపాధ్యక్ష పదవికి నల్లజాతీయురాలికి అవకాశం దక్కటంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.