మరో సీక్వెల్ లో నటిస్తున్న కమల్!

ఇటీవల పాత సినిమా లకు సీక్వెల్స్ ఎక్కువగా వస్తున్నాయి.ఈ క్రమంలో తాజాగా మరో సీక్వెల్ సినిమా వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 Kamal In Another Sequel-TeluguStop.com

కమల్ హాసన్ కెరియర్ లో చెప్పుకోదగ్గ చిత్రాల్లో ‘క్షత్రియ పుత్రుడు’ ఒకటి.అయితే ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ తీయాలని చూస్తున్నారు.అయితే ఈ సినిమాకి సీక్వెల్ చేయడానికి ఏకంగా కమలే రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది.1992లో తమిళనాట విడుదలైన ‘దేవర్ మగన్’ సంచలన విజయాన్ని సాధించింది.తెలుగులో ‘క్షత్రియపుత్రుడు’ పేరుతోను భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.

అయితే అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ చేయాలనే నిర్ణయానికి వచ్చిన కమల్, అందుకు సంబంధించిన సన్నాహాలను మొదలెట్టినట్టుగా తెలుస్తోంది.

తొలి షెడ్యూల్ ను పొల్లాచ్చి లో ఆరంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నారు.ఇప్పటికే ‘భారతీయుడు 2’ చేస్తున్న కమల్ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిన కారణంగా ఈ కారణం తీసుకున్నట్లు సినీ వర్గాలు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ వార్త లో ఎంత నిజం ఉంది అనే దానిపై కూడా స్పష్టమైన సమాచారం లేదు.అయితే దీనిపై క్లారిటీ రావాలి అంటే మరి కొద్దీ రోజులు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube