కేంద్రం ప్రతిపాదించిన సినిమాటోగ్రఫీ చట్టం 2021 పై నటుడు కమల్ హాసన్ తన మార్క్ స్పందన తెలియచేశారు.కొత్త చట్టం ప్రకారం సినిమాకు సర్టిఫికెట్ వచ్చిన తర్వాత కూఆ దాన్ని పునపరిశీలించి.
దాన్ని రద్దు చేసే అధికారం కేంద్రానికి ఉంటుంది.అయితే దీనిపై ఇప్పటికే చిత్ర ప్రముఖులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
కమల్ సైతం కేంద్రం ప్రతిపాదించిన ఈ సినిమాటోగ్రఫీ చట్టం 2021పై సెటైర్ వేశారు.తన ట్విటర్ లో తామేమీ వినొద్దు, చూడొద్దు.
మాట్లాడొద్దు అనేలా ఉండే మూడు కోతులం కాదని ఫైర్ అయ్యారు.భారత చిత్ర పరిశ్రమ స్వతంత్రంగానే ఉంచాలని దీని కోసం పరిశ్రమలోని ప్రతి ఒక్కరు తమ గొంతు వినిపించాలని కమల్ కోరారు. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే ప్రయత్నాలను అడ్డుకోవాలని కమల్ అన్నారు.కేంద్రం ప్రవేశపెట్టిన ఈ కొత్త చట్టం సినీ పరిశ్రమ స్వతంత్రతని హరిస్తుందని.అది రాజ్యాంగానికి విరుద్ధమని కొందరు సినీ ప్రముఖులు ఆరోపించారు.అయితే గతవారం ఈ ముసాయిదా బిల్లుని విడుదల చేసిన కేంద్రం దీనిపై పరిశ్రమ పెద్దల అభిప్రాయాలను కోరింది.
జూలై 2 వరకు సమయం ఇచ్చి వారి అభిప్రాయాలను తెలియపరచమని కోరింది. అయితే కేంద్రం ప్రతిపాదించిన ఈ చట్టంపై అందరు వ్యక్తిరేకంగా ఉన్నారు.