దేశంలో మొదలైనా కరోనా టీకాను ఎందరో తీసుకుంటున్నారు.కాగా నిన్న ప్రధాని మోదీతో పాటు పలువురు సీఎంలు కూడా టీకాలు తీసుకున్నారు.
ఇవాళ మరికొందరు కేంద్ర మంత్రులు కోవిడ్ టీకాలు తీసుకుంటున్నారు.అయితే దాదాపుగా కోవిడ్ వ్యాక్సిన్ మొదటి దశ గత నెలలో ప్రారంభించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం రెండో దశ టీకాలు వేస్తున్నారు.కాగా ప్రస్తుతం 60 ఏళ్లు దాటిన వారితో సహా, ఇతర వ్యాధులతో ఉన్న 45 ఏళ్లు దాటిన వారికి కూడా రెండవ దశలో కోవిడ్ టీకాలు వేస్తున్నారు.
ఇకపోతే ప్రముఖ నటుడు మక్కల్ నీధి మయ్యం పార్టీ చీఫ్ కమల్ హాసన్ ఇవాళ కోవిడ్ టీకా తీసుకున్నారు.60 ఏళ్లు దాటిన వారికి ఈ టీకా ఇస్తున్న నేపధ్యంలో, 66 ఏళ్ల వయస్సున్న కమల్ చెన్నైలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్లో ఆయన తొలి డోసు టీకా వేయించుకున్నారు.ఇక తమ గురించి, ఇతరుల గురించి ఆలోచించేవారు కరోనా టీకా వేసుకోవాలన్నారు తెలియచేస్తూ, ఇవాళ శరీరాన్ని ఇమ్యునైజ్ చేస్తామని, వచ్చే నెలలో అవినీతికి వ్యతిరేకంగా వ్యాక్సినేషన్ చేపడుతామని తన ట్వీట్లో కమల్ తెలిపారు.