ఇటీవల తమిళ నటుడు కమల్ హాసన్ కరోనా బారినపడిన సంగతి మనకు తెలిసిందే.ఈయన అమెరికా వెళ్లి వచ్చిన తర్వాత అస్వస్థతకు లోనవగా కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని నిర్ధారణ జరిగింది.
ఈ క్రమంలోనే ఈనెల 22వ తేదీన ఆయన చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు.ఈ క్రమంలోనే శ్రీ రామచంద్ర మెడికల్ సెంటర్ లో కమల్ హాసన్ ఐసోలేషన్ వార్డులో చికిత్స తీసుకున్నారు.
ఇక డిసెంబర్ 1వ కమల్ హాసన్ కరోనా నుంచి కోలుకున్నారని అయితే 3వ తేదీ వరకు కమల్ హాసన్ ఐసొలేషన్ లో ఉంటారని తెలిపారు.ఈ క్రమంలోనే కరోనా నుంచి ఆయన పూర్తిగా కోలుకున్నారని ఇకపై అతను రోజు వారీ కార్యకలాపాలలో పాల్గొనవచ్చని శనివారం అతనిని డిశ్చార్జ్ చేస్తూ వైద్య సిబ్బంది హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
కమల్ హాసన్ అక్కడి వైద్యులతో కలిసి ఫోటో దిగారు.
ఇక హాస్పిటల్ నుంచి ఇంటికి చేరుకున్న కమల్ హాసన్ ఓ పత్రికా ప్రకటన చేశారు.కరోనా నుంచి కోలుకుని క్షేమంగా ఇంటికి వచ్చాను.నేను క్షేమంగా ఇంటికి రావాలని కోరుకున్న ముఖ్యమంత్రి సీఎం స్టాలిన్, తన స్నేహితుడు రజినీకాంత్, ఇతర సినీ ప్రముఖులు, నేను కోలుకోవాలని పూజలు చేసిన అభిమానులు,మక్కల్ నీది మయ్యం కార్యకర్తలకు ధన్యవాదాలు.
మీరు చేసే పూజలు ఫలిస్తాయో లేదో నాకు తెలియదు కానీ నేను మాత్రం మీ ప్రేమాభిమానాలకు దాసోహుడిని అంటూ కమల్ హాసన్ పేర్కొన్నారు.