కమల్ హాసన్ తమిళ రాజకీయాలలో పూర్తిగా బిజీగా ఉన్నాడు.ఎలా అయిన రానున్న అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ తరుపున ప్రభావం చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు.
దానికి సంబందించిన కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు.ఇదిలా ఉంటే కమల్ హాసన్ దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలో ఇండియన్ మూవీ సీక్వెల్ చేస్తున్నాడు.
పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో, భారీ తారాగణంతో దర్శకుడు శంకర్ ఆవిష్కరిస్తున్నాడు.అయితే కరోనా పరిస్థితుల కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడింది.
అయితే ప్రస్తుతం శంకర్ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఏప్రిల్ లో తమిళనాడు ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో వీలైనంత త్వరగా షూటింగ్ స్టార్ట్ చేయాలని కమల్ హాసన్ దర్శకుడు శంకర్ కి తెలియజేసినట్లు తెలుస్తుంది.
వచ్చే ఏడాది జనవరి తరువాత ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలంటే ఈ లోపే షూటింగ్ కంప్లీట్ చేయాల్సి ఉంది.ఇక కమల్ ఇండియన్ 2 మూవీ అతని రాజకీయ భవిష్యత్తుకి పునాది లాంటిది.
ఈ నేపధ్యంలో సినిమా షూటింగ్ వీలైనంత వేగంగా పూర్తి చేసి రిలీజ్ కి రెడీ చేయాలని శంకర్ కి కమల్ హాసన్ డెడ్ లైన్ పెట్టినట్లు తెలుస్తుంది.జనవరిలోపు షూటింగ్ పెట్టాలని లేదంటే తరువాత డేట్స్ ఇవ్వలేలని శంకర్ కి క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం.
ఈ నేపధ్యంలో ఇప్పటికే మెజారిటీ పార్ట్ కంప్లీట్ చేసిన శంకర్ మిగిలిన షూటింగ్ కోసం షెడ్యూల్ ఖరారు చేసుకునే పనిలో పడ్డాడని తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో సిద్ధార్ద్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.
మరి కమల్ హాసన్ పెట్టిన డెడ్ లైన్ లోపు శంకర్ ఇండియన్ 2 మూవీ పూర్తి చేస్తాడా లేదా అనేది వేచి చూడాలి.