ఏపీలో అధికార పార్టీ టీడీపీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంది.ఓ వైపు అధినేత చంద్రబాబు తనదైన శైలిలో ఎన్నికల ప్రచారాన్ని రక్తి కట్టిస్తూ తన మాటల గారడీతో ప్రజలని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పటికే సంక్షేమ పథకాల తనకి లాభిస్తాయని భావిస్తున్న చంద్రబాబు ప్రజలని తన వైపు తిప్పుకోవడానికి ఉన్న ఎ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు.ఇక తన ఎన్నికల ప్రచారంలో భాగంగా జాతీయ స్థాయిలో తనకున్న గుర్తింపుని ఉపయోగించుకుంటున్నారు.
ఇందులో భాగంగా ఇప్పటికే ఏపీలో టీడీపీ తరుపున ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.అలాగే కాశ్మీర్ మాజీ సిఎం కూడా టీడీపీ తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొని జగన్ పై సంచలన ఆరోపణలు చేసారు.
అదే టైంలో మళ్ళీ చంద్రబాబుని అధికారంలోకి తీసుకొస్తే ఏపీకి మంచి జరుగుతుంది అని తెలియజేసారు.అయితే ఈ ఇద్దరు నాయకుల ప్రభావం ఏపీ ఓటర్స్ మీద అంతగా పని చేయలేదని రాజకీయంగా వినిపిస్తున్న మాట.వీరు చేసిన ప్రచారం ఏపీలో ఏమంత ప్రభావం చూపించలేదని అభిప్రాయం వినిపిస్తుంది.
ఈ నేపధ్యంలో చంద్రబాబు మరో కొత్త ఎత్తుకి సిద్ధం అయ్యారు.తమిళ రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్ నటుడు కమల్ హసన్ కి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.అతనంటే క్రేజీ ఇమేజ్ లేకపోయినా కమల్ హసన్ ని నటుడుగా ఇక్కడి ప్రజలు ఇష్టపడతారు.
దీంతో అతని సినీ గ్లామర్ ని ఏపీలో తెలుగు దేశం పార్టీలో వాడుకోవాలని డిసైడ్ అయిన చంద్రబాబు తాజా అతన్ని రంగంలోకి దించాడు.విశాఖలో జరిగే భారీ బహిరంగ సభలో కమల్ హసన్ పాల్గొని తెలుగు దేశం తరుపున ప్రచారం చేయనున్నారు.
అలాగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మాజీ ప్రధాని దేవగౌడ కూడా ఈ సభలో పాల్గొననున్నారు.మరి వీళ్ళ ప్రచారం టీడీపీకి ఎంత వరకు ఉపయోగపడుతుంది అనేది చూడాలి.