మక్కల్ నీది మయ్యం అధినేత,గ్లోబల్ స్టార్ కమల్ హాసన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యల తో వార్తల్లో నిలిచారు.ఇటీవల హిందువుల పై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అంశం ఇంకా చల్లారనే లేదు.
మళ్లీ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.ప్రతి మతంలోనూ ఉగ్రవాదులు ఉన్నారు అంటూ వ్యాఖ్యలు చేసిన ఆయన ఇప్పుడు అసలు పురాణాల్లో హిందూ అన్న పదమే లేదంటూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
భారత్పై దండెత్తిన విదేశీయులే హిందూ అన్న పదాన్ని తీసుకొచ్చారని నిజానికి పురాణాల్లో హిందువు అన్న పదమే లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి దుమారం రేపాయి.హిందూ అనే పదం కంటే మనమంతా భారతీయులమని పిల్చుకోవాలంటూ కమల్ పిలుపుయిచ్చారు.
ఇటీవల రోడ్ షో లో పాల్గొన్న కమల్ స్వతంత్ర భారతదేశంలో తోలి ఉగ్రవాది హిందువే నంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.దీనితో కమల్ అటు రాజకీయ నేతలు,మరోపక్క సినిమా స్టార్స్ కూడా మండిపడుతున్నారు.
బీజేపీ నేతలు అయితే ఆయన పై చర్యలు తీసుకోవాలి అంటూ ఈసీ కు కూడా ఫిర్యాదు చేసారు.ఈ నేపథ్యంలో ఈసీ కమల్ ను వివరణ కూడా కోరింది.
అయితే మరోపక్క కమల్ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కరూర్లో జరిగిన సభలో కమల్పైకి రాళ్లు, గుడ్లు, చెప్పులు కూడా విసిరారు.ఇన్ని అనర్ధాలు జరుగుతున్నప్పటికీ వాటిని పట్టించుకోను అంటూ కమల్ పదే పదే సున్నిత అంశాల పైనే వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
.