తెలుగులో ఒకప్పుడు కళ్యాణి, పవిత్ర బంధం, మెట్టెల సవ్వడి, తదితర ధారావాహికల ద్వారా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ సీరియల్ నటి గాయత్రి శాస్త్రి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే నటి గాయత్రి శాస్త్రి ముంబైలో పుట్టి పెరిగినప్పటికీ సౌత్ ఇండియా బుల్లితెరపై నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
కాగా నటి గాయత్రి శాస్త్రి “పాశమలర్గలర్” అనే తమిళ చిత్రం ద్వారా నటిగా ఎంట్రీ ఇచ్చింది.కానీ సినిమా ఇండస్ట్రీలో పెద్దగా నిలదొక్కుకోలేకపోయింది.
దీంతో తన సినీ కెరీర్ ను దృష్టిలో ఉంచుకుని బుల్లితెరలో అవకాశాల కోసం బాగానే ప్రయత్నించింది.
ఈ క్రమంలో తెలుగులో గాయత్రి శాస్త్రి ధారావాహికలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది.
దీంతో గాయత్రి శాస్త్రికి తెలుగులో వరుస ధారావాహికలలో నటించే అవకాశాలు వరించాయి.అయితే గత కొద్ది కాలంగా నటి గాయత్రి శాస్త్రి తన కుటుంబ బాధ్యతలను చక్కబెట్టే పనిలో పడింది.
దీంతో ప్రస్తుతం ధారావాహికలలో నటించడం లేదు.అయితే ఈ మధ్య కాలంలో నటి గాయత్రి శాస్త్రి సినిమా షూటింగులు లేకపోవడంతో బాగానే బరువు పెరిగినట్లు తెలుస్తోంది.
కాగా తాజాగా నటి గాయత్రి శాస్త్రి తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన కూతురుతో కలిసి దిగినటువంటి ఫోటోలని షేర్ చేసింది.దీంతో కొందరు తెలుగు నెటిజన్లు తెలుగులో మళ్ళీ ఎప్పుడు నటిస్తారని అంటూ గాయత్రి శాస్త్రి ని ప్రశ్నిస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం గాయత్రి శాస్త్రి తన కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడులోని చెన్నైలో నివాసం ఉంటున్నట్లు సమాచారం.అలాగే ఓ తమిళ ప్రముఖ ఛానెల్ లో ప్రసారమవుతున్న ధారావాహికలో కూడా మెయిన్ లీడ్ పాత్రలో నటిస్తోంది.