సంపత్ నంది దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ ప్రస్తుతం సిటీమార్ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ సినిమాలో గోపీచంద్ కి జోడగా తమన్నా నటిస్తుంది.
ఇక కబడ్డీ నేపధ్యంలో ఈ సినిమా కథ ఉంటుందని ఇప్పటికే చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చేసింది.సినిమా కూడా మెజారిటీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిపొయింది.
ఇక లాక్ డౌన్ పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత మరల రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి సినిమాని వీలైనంత వేగంగా అందుబాటులోకి తీసుకొని రావాలని చూస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత గోపీచంద్ తేజ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఒకే చెప్పాడు.
అలివేలు మంగ వెంకటరమణ టైటిల్ తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది.భార్యభర్తల మధ్య ప్రేమ, కలహాలు ఎలిమెంట్స్ తో ఈ సినిమా కథనం ఉండబోతుంది అని తెలుస్తుంది.
ఇక ఈ సినిమా కూడా త్వరలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి హీరోయిన్స్ ఎంపిక జరిగింది.ఇందులో మెయిన్ హీరోయిన్ గా కీర్తి సురేష్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది.ఇక సెకండ్ లీడ్ లో కళ్యాణి ప్రియదర్శన్ ఒక హీరోయిన్ గా కనిపించబోతుంది అని సమాచారం.
త్వరలో హీరోయిన్స్ విషయాన్ని అఫీషియల్ గా ఎనౌన్స్ చేసే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది.ఇప్పటికే వరుస ఫ్లాప్ లతో ఉన్న గోపీచంద్ ఎలా అయిన సాలిడ్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు.
మరి అతనికి సితీమార్ సినిమా గాని, అలివేలు సినిమా గాని ఎంత వరకు సక్సెస్ ఇస్తాయనేది వేచి చూడాలి.