రైలు ఎక్కినప్పుడు అయినా దిగినప్పుడు అయినా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.కదులుతున్న రైలు నుండి దిగేందుకు కానీ ఎక్కేందుకు అసలు ప్రయత్నాలు చెయ్యకూడదు.
అలా చేస్తే ప్రమాదాల భారిన పడకతప్పదు.రైలు దిగే సమయంలో కాస్త ఏమరపాటుగా ఉన్న ప్రాణాలు గాల్లోకి కలిసిపోతాయి.
ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి.
ఇంకా ఈ నేపథ్యంలోనే 51 ఏళ్ళ వ్యక్తి కదిలిన రైలు నుండి కిందికి దిగేందుకు ప్రయత్నించి కిందపడ్డాడు.
ఆ వెంటనే రైలుకు, ప్లాట్ఫాం మధ్య ఉండే గ్యాప్లో పడబోతుంటే అక్కడే ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్ కె.సాహు మెరుపు వేగంతో వెళ్లి అతన్ని రక్షించాడు.ఈ ఘటన ముంబైలోని కల్యాణ్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది.
సీఆర్పీఎఫ్ జవాన్ ఒక్క క్షణం అటు ఇటు లేటు చేసిన అతడి శరీరం నుజ్జునుజ్జయ్యేది.
ఇంకా ఈ ఘటన అంత రైల్వే స్టేషన్లోని సీసీటీవీ కెమేరాలో రికార్డ్ అయ్యింది.కాగా అతడిని రక్షించడానికి రైలు నుంచి బయటకు దూకిన మరో వ్యక్తి మహారాష్ట్ర సెక్యూరిటీ ఫోర్స్ సోమనాథ్ అని ఆ వీడియో ద్వారా తెలిసింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.