నందమూరి కుటుంబం నుంచి హీరోలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారిలో నటుడు కళ్యాణ్ రామ్ ఒకరు ఈయన హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు.అయితే కళ్యాణ్ రామ్ చాలా సంవత్సరాల తర్వాత బింబిసారా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి గత ఏడాది ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు.
ఈ క్రమంలోనే ఈయన తాజాగా రాజేందర్ రెడ్డి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన యాక్షన్ త్రిల్లర్ చిత్రం అమిగోస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.
ఈ సినిమా ఫిబ్రవరి 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.అయితే కళ్యాణ్ రామ్ సోదరుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో కళ్యాణ్ రామ్ పెద్దగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనలేదు అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి పోస్టర్స్ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ త్విపాత్రాభినయంలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారికి సెంటిమెంట్లు కాస్త ఎక్కువగానే ఉంటాయి అందుకే వారి సినిమాల విషయంలో ఇలాంటి సెంటిమెంట్లను ఫాలో అవుతుంటారు.ఈ క్రమంలోనే కళ్యాణ్ రామ్ కూడా తన చిత్రం అమిగోస్ విషయంలో తన సెంటిమెంట్ ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది.ఈయన గత ఏడాది నటించిన బింబిసారా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ హాజరైన విషయం మనకు తెలిసిందే అయితే ఈ సినిమా ఎంతో సూపర్ సక్సెస్ అందుకుంది.ఈ క్రమంలోనే మరోసారి తన సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ఎన్టీఆర్ ను ఆహ్వానిస్తున్నారు.
ఈ క్రమంలోనే బింబిసార సెంటిమెంటును కళ్యాణ్ రామ్ కంటిన్యూ చేస్తున్నారని తెలుస్తుంది.అయితే ఈ సినిమా విషయంలో కళ్యాణ్ రామ్ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.