ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు కేవలం నటీనటులు గానే కాకుండా నిర్మాతగా, దర్శకులుగా కూడా బాధ్యతలు చేపడుతుంటారు.అలా రెండు వైపులా సంపాదిస్తుంటారు.
కానీ కొందరికి అలా కలిసిరాదు.రెండింటిలో ఏదో ఒక దాంట్లోనే అలా ఆర్థికంగా బాగుంటుంది.
కానీ మరికొంతమందికి రెండింటిలో కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.అందులో కళ్యాణ్ రామ్ కూడా ఉన్నాడనే చెప్పాలి.
నందమూరి నట వారసుడు, టాలీవుడ్ నటుడు నందమూరి కళ్యాణ్ రామ్ గురించి అందరికీ తెలిసిందే.నందమూరి కుటుంబం నుండి హీరోలుగా పరిచయమైన ప్రతి ఒక్కరు మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.
కానీ కళ్యాణ్ రామ్ మాత్రం అంతగా గుర్తింపు అందుకోలేకపోయాడు.ఈయన తెలుగులో కొన్ని సినిమాలలో మాత్రమే నటించాడు.
ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీకి 1989 లో విడుదలైన బాల గోపాలుడు సినిమాతో బాలనటుడుగా ఎంట్రీ ఇచ్చాడు.ఆ తర్వాత కొంత గ్యాప్ తర్వాత 2003లో తొలిచూపులోనే, అభిమన్యు అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు.
ఇక 2005లో అతనొక్కడే సినిమాతో నిర్మాతగా కూడా పరిచయం అయ్యాడు.తాను నటించిన సినిమాకే నిర్మాతగా బాధ్యతలు చేపట్టాడు.స్వయంగా తానే ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ ను స్థాపించి పలు సినిమాలకు నిర్మాతగా బాధ్యతలు చేపట్టాడు.
అలా చాలా వరకు తాను నటించిన సినిమాలకే హీరోగా, నిర్మాతగా చేశాడు.ఇక రవితేజ నటించిన కిక్ 2, జై లవకుశ సినిమాలకు కూడా నిర్మాతగా బాధ్యతలు చేపట్టాడు.కానీ తను నిర్మించిన సినిమాలు చాలా వరకు మంచి సక్సెస్ కాకపోవడంతో గతంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
అదే సమయంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి కళ్యాణ్ రామ్ కు కిక్ 2 సినిమాకు బాధ్యతలు ఇస్తానని మాట ఇచ్చాడు.
దీంతో కళ్యాణ్ రామ్ కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడట.ఎందుకంటే ఇదివరకే కిక్ సినిమా మంచి హిట్ ను సాధించుకోవడంతో కిక్ 2 కూడా మంచి సక్సెస్ అందుకుంటుందని అనుకున్నాడట.దీంతో తను ఆర్థికంగా కూడా కాస్త ఇబ్బందుల నుండి ఉపశమనం కలుగుతుందని అనుకున్నాడట.
అలా కిక్ 2 సినిమాను డైరెక్టర్ సురేందర్ రెడ్డి సాగదీస్తూ ఉండటంతో వర్కింగ్ డేట్స్ బాగా పెరిగాయట.
సినిమా సమయం కూడా మూడు గంటలకు పై గానే వచ్చిందట.కానీ ఈ సినిమా సమయాన్ని తగ్గించడానికి డైరెక్టర్ అసలు ఒప్పుకోలేదట.చాలా సన్నివేశాలను మళ్లీ మళ్లీ రీషూట్ చేశారట.
దీంతో ఆర్థికంగా బాగా ఖర్చులు పెరిగిపోయాయని తెలిసింది.ఎలాగైనా ఈ సినిమా హిట్ అందుకుంటుందని అనుకున్నాడట కళ్యాణ్ రామ్.
కానీ ఈ సినిమా విడుదల తర్వాత ప్రేక్షకుల నుండి రెస్పాన్స్ సరిగ్గా లేకపోవడంతో ఈ సినిమా హిట్ కాలేకపోయింది.
ఆ తర్వాత జై లవ కుశ సినిమాకు నిర్మాతగా బాధ్యతలు చేపట్టి ఈ సినిమాతో మంచి లాభాలు అందుకున్నాడు కళ్యాణ్ రామ్.
ఇక ఈయన గత ఏడాది ‘ఎంత మంచి వాడవురా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా అంత సక్సెస్ కాలేదు.ఇక ప్రస్తుతం ఓ సినిమాలో బిజీగా ఉన్నాడు.