నందమూరి అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఓ భారీ సినిమా ఎప్పుడెప్పుడు తెరకెక్కుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.నందమూరి బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నందమూరి నట వారసత్వాన్ని విజయవంతంగా తమ భుజాలపై మోస్తూ ఇతర హీరోలకు చుక్కలు చూపిస్తున్నారు.
కాగా ఈ ఇద్దరు హీరోలు కలిసి ఎప్పుడు సినిమా చేస్తారా అని తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
అయితే గతంలో వీరిద్దరితో కలిసి సినిమా చేయాలని పలువురు ప్రయత్నించినా అది విఫలయత్నంగా మిగిలింది.
దీంతో బాలయ్య-తారక్ల మల్టీస్టారర్ సినిమా ఇక అసాధ్యం అని అందరూ అనుకున్నారు.కానీ నందమూరి కళ్యాణ్ రామ్ మాత్రం తమ కుటుంబానికి చెందిన హీరోలతో ఖచ్చితంగా ఓ భారీ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కించాలని చూస్తున్నాడు.
ఈ క్రమంలో బాలయ్య-తారక్ల కోసం ఓ పవర్ఫుల్ సబ్జెక్ట్ను రెడీ చేయాల్సిందిగా పలువురు డైరెక్టర్లకు సూచించాడట.కానీ ఈ మల్టీస్టారర్ మూవీ ఇప్పట్లో తెరకెక్కే సూచనలు మాత్రం కనిపించడం లేదు.
మరో రెండేళ్ల వరకు తారక్ బిజీగా ఉంటాడు.దీంతో రెండేళ్ల తరువాత వీరిద్దరితో కలిసి కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ మూవీని ప్లాన్ చేస్తున్నాడు.
వీలైతే తాను కూడా ఈ సినిమాలో కలిసి నటించేందుకు ప్రయత్నం చేస్తున్నాడట.తన సొంత బ్యానర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్పై ఈ సినిమాను తెరకెక్కించేందుకు కళ్యాణ్ రామ్ రెడీ అవుతున్నాడు.
మరి నందమూరి ఫ్యామిలీ నుండి బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఎప్పుడు వస్తుందో చూడాలి.