టాలీవుడ్లో ట్రిపుల్ రోల్స్ చేసిన హీరోల సంఖ్య చాలా తక్కువ.ఇలాంటి ఫీట్ కొట్టాలంటే కేవలం హీరోనే కాకుండా సినిమా కథ కూడా పర్ఫెక్ట్గా ఉంటేనే ఆ సినిమా హిట్ అవుతుందని చాలాసార్లు రుజువయ్యింది.
ఇక ప్రస్తుతం ఉన్న హీరోల్లో ట్రిపుల్ రోల్ చేసింది ఎవరంటే అందరూ ఠక్కున జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పేస్తారు.‘జై లవ కుశ’ చిత్రంలో ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు.
కాగా ఈ సినిమా తరువాత ఇప్పుడు మరో హీరో ట్రిపుల్ రోల్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
నందమూరి ఫ్యామిలీ నుండి వచ్చిన కళ్యాణ్ రామ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును క్రియేట్ చేసుకున్నాడు.
హీరోగా చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న కళ్యాణ్ రామ్, అటు ప్రొడ్యూసర్గా కూడా రాణిస్తున్నాడు.కాగా తాజాగా కళ్యాణ్ రామ్ చేయబోయే ఓ కొత్త సినిమాలో ఏకంగా మూడు పాత్రల్లో నటించేందుకు రెడీ అవుతున్నాడట.
రాజేందర్ అనే కొత్త దర్శకుడు చెప్పిన కథకు కళ్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో మూడు విభిన్న పాత్రల్లో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు.
త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఉంటుందని, ఈ సినిమా కథ ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందని కళ్యాణ్ రామ్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేయనుండటంతో ఈ సినిమాపై అప్పుడే ఫిలింనగర్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
మరి ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్స్ ప్రేక్షకులను ఎంతమేర మెప్పిస్తాయో తెలియాలంటే మాత్రం ఈ సినిమా పూర్తయ్యి రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.ఎన్టీఆర్ తరువాత ట్రిపుల్ యాక్టింగ్ చేస్తున్నది కూడా నందమూరి హీరో కావడంతో నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.