నందమూరి కళ్యాణ్ రామ్ ఇప్పటికే వరుసగా పెద్ద ఫ్లాప్లను మూటకట్టుకుంటూ పోతున్నాడు.చేసిన ప్రతి సినిమా ఆయన వెనుకాల ఫ్లాప్లుగా నిలిచి పోతున్నాయి తప్ప ఒక్కటి అయినా కూడా సక్సెస్లను దక్కించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.
ఇలాంటి సమయంలో కళ్యాణ్ రామ్ మరో ప్రమాదం నుండి తప్పించుకున్నాడు.అదే ‘కవచం’ అంటూ ప్రచారం జరుగుతుంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ‘కవచం’ చిత్రాన్ని మొదట కళ్యాణ్ రామ్తో చేసేందుకు దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ల ప్లాన్ చేశాడట.
కళ్యాణ్ రామ్ను దృష్టిలో పెట్టుకుని మరీ దర్శకుడు శ్రీనివాస్ కథను సిద్దం చేసుకున్నాడట.తనకున్న పరిచయాలతో కళ్యాణ్ రామ్కు కథ వినిపించడం జరిగిందట.కథ బాగుందని చెప్పిన కళ్యాణ్ రామ్ ఇది తనకు సెట్ అవ్వదని చెప్పాడట.
ఆ సినిమాను సున్నింతంగా తిరష్కరించిన కళ్యాణ్ రామ్ ప్రస్తుతం గుహన్ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్నాడు.కళ్యాణ్ రామ్ వద్దన్న సినిమాను బెల్లంకొండ శ్రీనివాస్తో దర్శకుడు తెరకెక్కించాడు.
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా కాజల్, మెహ్రీన్ హీరోయిన్గా తెరకెక్కిన ఆ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యిందనే టాక్ వస్తుంది.దాంతో చిత్ర యూనిట్ సభ్యులు తీవ్రంగా నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.ఇదే సమయంలో నందమూరి ఫ్యాన్స్ కళ్యాణ్ రామ్ ఈ సినిమాకు నో చెప్పడం చాలా మంచిది అయ్యింది అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.