ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి బాలయ్య, తారక్ తర్వాత కొద్దో గొప్పో ఇమేజ్ ఉన్న హీరో అంటే కళ్యాణ్ రామ్ అని చెప్పాలి.ఓ వైపు నిర్మాతగా, మరో వైపు సొంత వ్యాపారాలు చూసుకుంటూ ఏడాదికి ఒక కళ్యాణ్ రామ్ చేస్తూ వస్తున్నాడు.
అయితే ఈ సారి మాత్రం కాస్తా స్పీడ్ పెంచిన ఈ నందమూరి హీరో ఏకంగా మూడు సినిమాలని లైన్ లో పెట్టాడు.అందులో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రాజేంద్ర దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతుంది.
అలాగే వేణు మల్లిడి దర్శకత్వంలో ఒక సోషియో ఫాంటసీ ఫిక్షన్ కథాంశంతో తుగ్లక్ అనే అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా భారీ బడ్జెట్ తో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు.
ఇక రీసెంట్ గా మరో దర్శకుడుకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే రాజేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయ్యింది.
ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మొదటి సారి త్రిపాత్రభినయం చేస్తున్నట్లు తెలుస్తుంది.ఇక సినిమాకి అమిగోస్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.
ఈ మూడు పాత్రల చుట్టూ కథ నడుస్తూ ఉంటుందని, ప్రేమ, స్నేహం అనే ఎలిమెంట్స్ ఆధారం ఈ కాన్సెప్ట్ ఉండబోతుందని తెలుస్తుంది.ఇక ఈ సినిమా కోసం కళ్యాణ్ రామ్ డిఫరెంట్ లుక్స్ ట్రై చేయబోతున్నట్లు సమాచారం.
సీనియర్ ఎన్టీఅర్, బాలకృష్ణ, తారక్ ముగ్గురు త్రిపాత్రాభినయంలో ఇప్పటికే మెరిసారు.ఇప్పుడు కళ్యాణ్ రామ్ కూడా ఈ జాబితాలో చేరబోతున్నాడని తెలుస్తుంది.
లాక్ డౌన్ తర్వాత ఈ సినిమా గురించి పూర్తి
.