నిన్న లోకేష్ పాదయాత్ర ప్రారంభం రోజు నందమూరి తారకరత్నకి గుండెపోటు రావడం తెలిసిందే.ఈ క్రమంలో కుప్పంలో చికిత్స అందించగా పరిస్థితి విషమించటంతో హుటాహుటిన నిన్న సాయంత్రం బెంగళూరుకి తరలించడం జరిగింది.
అయితే గుండెకు సంబంధించి దాదాపు 90 శాతం వాల్స్ బ్లాక్ కావటంతో… అత్యాధునిక వైద్య నిపుణులు చికిత్స అందిస్తున్నారట.బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో నందమూరి తారకరత్న ఉన్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్లు నందమూరి కుటుంబ సభ్యులు అదేవిధంగా చంద్రబాబు నాయుడు సైతం బెంగళూరు వెళ్లడం జరిగింది.కాగా నిన్న గుండెపోటు వచ్చిన సమయంలో కుప్పంలో చికిత్స అందిస్తుండగానే బాలకృష్ణతో తారకరత్న ఆరోగ్యానికి సంబంధించి అన్ని వివరాలు ఎన్టీఆర్ ఫోన్ చేసి అడిగి తెలుసుకోవడం జరిగింది.
పరిస్థితి ఇలా ఉండగా రేపు జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్.తారకరత్ననీ చూడటానికి బెంగళూరు వెళ్తున్నారు.
ప్రస్తుతం హాస్పిటల్లో తారకరత్న తండ్రి, భార్య, కూతురు, బాలకృష్ణ మరియు చంద్రబాబు ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు.