తారకరత్ననీ చూడటానికి రేపు బెంగళూరు వెళ్తున్న కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్..!!

నిన్న లోకేష్ పాదయాత్ర ప్రారంభం రోజు నందమూరి తారకరత్నకి గుండెపోటు రావడం తెలిసిందే.ఈ క్రమంలో కుప్పంలో చికిత్స అందించగా పరిస్థితి విషమించటంతో హుటాహుటిన నిన్న సాయంత్రం బెంగళూరుకి తరలించడం జరిగింది.

 Kalyan Ram Ntr Going To Bengaluru Tomorrow To See Tarakaratna Details,  Kalyan R-TeluguStop.com

అయితే గుండెకు సంబంధించి దాదాపు 90 శాతం వాల్స్ బ్లాక్ కావటంతో… అత్యాధునిక వైద్య నిపుణులు చికిత్స అందిస్తున్నారట.బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో నందమూరి తారకరత్న ఉన్నారు.

ఈ క్రమంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్లు నందమూరి కుటుంబ సభ్యులు అదేవిధంగా చంద్రబాబు నాయుడు సైతం బెంగళూరు వెళ్లడం జరిగింది.కాగా నిన్న గుండెపోటు వచ్చిన సమయంలో కుప్పంలో చికిత్స అందిస్తుండగానే బాలకృష్ణతో తారకరత్న ఆరోగ్యానికి సంబంధించి అన్ని వివరాలు ఎన్టీఆర్ ఫోన్ చేసి అడిగి తెలుసుకోవడం జరిగింది.

పరిస్థితి ఇలా ఉండగా రేపు జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్.తారకరత్ననీ చూడటానికి బెంగళూరు వెళ్తున్నారు.

ప్రస్తుతం హాస్పిటల్లో తారకరత్న తండ్రి, భార్య, కూతురు, బాలకృష్ణ మరియు చంద్రబాబు ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube