ఎవరైనా సంగీత దర్శకులు ఒక సినిమాలో ఓ పాటను కంపోజ్ చేయడానికి కొన్ని ట్యూన్ లతో రెండు లేదా అంతకంటే కొన్నిసార్లు మాత్రమే పాట పూర్తిగా మంచి మ్యూజిక్ తో వచ్చే వరకు కంపోజ్ చేస్తుంటారు.అంతేకాకుండా వాటికి మధ్య మధ్యల కొత్త కొత్త లిరిక్ లతో, సౌండ్ తో, డైలాగులతో పాటలను కంటిన్యూ చేస్తూంటారు.
అలా సినీ దర్శకులకు తమ సినిమాలో పాట అద్భుతంగా వచ్చే వరకు సంగీత దర్శకులను కాస్త పాటుపడతారని చెప్పవచ్చు.
ఇదిలా ఉంటే ఒక్క పాటకు కొంతవరకు ట్యూన్ లను వినిపించడమే కాస్త కష్టం అంటే.
ఏకంగా ఓ పాట కోసం 75 ట్యూన్ లను వినిపించాలని తెలిపాడట ఓ సినీ దర్శకుడు.ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో కాదు చంద్రశేఖర్ యేలేటి.ఆయన హీరో నితిన్ తో కలిసి ‘చెక్’ అనే సినిమాను చేస్తున్నారు.అయితే ఈ సినిమా కోసం దర్శకుడు ఒక పాటను 75 ట్యూన్ లతో వినిపించాలని తెలిపారు.
దీంతో ఈ పాటను సంగీత దర్శకుడు కీరవాణి స్వయానా సోదరుడు అయినా కళ్యాణ్ మాలిక్ వినిపించనున్నాడు.కళ్యాణ్ మాలిక్ కు సంగీతం పట్ల మంచి టాలెంట్ ఉంది.ఎన్నో మంచి మంచి పాటలను కొన్ని సినిమాలలో అందించాడు.కానీ ఆయనకు ఎక్కువగా అవకాశాలు రాలేకపోయాయి.ఇక నితిన్ నటిస్తున్న ఈ సినిమాలో అవకాశం రాగా.ఈ సినిమాలో ఉన్న ఒకే ఒక్క రొమాంటిక్ సాంగ్ కోసం 75 ట్యూన్ లను వినిపించే వరకు దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి సంతృప్తి చెందలేదని సంగీత దర్శకుడు కొన్ని విషయాలు తెలిపాడు.
ఇక ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎక్కువగా ఉందని, ఈ సినిమాకు ఒకే ఒక పాటకు స్కోప్ ఉందని తెలిపాడు.కానీ ఇది కావాలని పెట్టినది కాదని తెలిపాడు.
ఇక ఈ సినిమా ఈ పాటకు సంగీతం అందించడానికి దాదాపు 30 రోజుల సమయం పట్టింది అని తెలిపాడు.ఇన్ని రోజులు ఒక పాట కోసం పని చేయడం ఇదే మొదటిసారి అని తెలిపాడు కళ్యాణ్.
తాజా వార్తలు