మెగా ఫ్యామిలీ నుండి హీరోగా వచ్చిన వారిలో చిరంజీవి రెండో అల్లుడు కళ్యాణ్ దేవ్ తొలి చిత్రం ‘విజేత’తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.కాగా ఆయన అనుకున్న స్థాయిలో విజేత సినిమా సక్సెస్ కాలేదు.
కాగా చాలా గ్యాప్ తరువాత తన రెండో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.‘సూపర్ మచ్చి’ అనే టైటిల్తో తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు కళ్యాణ్ దేవ్.
ఇక ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులు మొదులపెట్టుకున్న సంగతి తెలిసిందే.
అయితే లాక్డౌన్ కారణంగా ఈ సినిమా కూడా వాయిదా పడింది.
కాగా ప్రస్తుతం సినిమా షూటింగ్లకు అనుమతి లభించడంతో ‘సూపర్ మచ్చి’ చిత్ర షూటింగ్ను తిరిగి ప్రారంభించేశారు.అయితే ఈ సినిమాను మరోసారి వాయిదా వేయకుండా చివరి షెడ్యూల్ను వీలైనంత త్వరగా పూర్తి చేసే పనిలో కళ్యాణ్ దేవ్ ఉన్నాడు.
ఈ క్రమంలోనే ఈ సినిమాలోని ఓ పాటను షూట్ చేస్తున్నారు చిత్ర యూనిట్.హైదరాబాద్లోని ఓ స్టూడియోలో ఈ సాంగ్ షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
కరోనా వైరస్ వ్యాప్తిస్తున్న నేపథ్యంలో చాలా జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమా షూటింగ్ను చేస్తున్నారట చిత్ర యూనిట్.ఇక ఈ సినిమాలో హీరోయిన్గా కన్నడ బ్యూటీ రచితా రామ్ నటిస్తోండగా పులి వాసు అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.
రిజ్వాన్ నిర్మిస్తున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.మరి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ముగించుకుంటుందో చూడాలి.