లాక్ డౌన్ తర్వాత సినిమాలన్నీ షూటింగ్ లను చకచకా పూర్తి చేసుకుంటూ వరుసగా విడుదల తేదీలను ప్రకటిస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబం నుంచి దాదాపు అందరి సినిమాలను విడుదల చేయడానికి తేదీలను ఖరారు చేశారు.
కానీ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ నటించిన సూపర్ మచ్చి సినిమా ఊసే ఎత్తడంలేదు.ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని కళ్యాణ్ దేవ్ తరువాత కిన్నెరసాని సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు.
కానీ సూపర్ మచ్చి సినిమా గురించి మెగా హీరోలు పట్టించుకోకపోవడం ఆశ్చర్యంగా ఉంది.
ఇప్పటికే మెగా కాంపౌండ్ నుంచి చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా మే 13న విడుదలకు సిద్ధమైంది.
అదేవిధంగా రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ అక్టోబర్ 13 విడుదల తేదీని ప్రకటించింది.ఇక తాజాగా షూటింగ్ ప్రారంభించనున్న వరుణ్ తేజ్ గని సినిమా కూడా విడుదల తేదీని ప్రకటించింది.
ఇక అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు సందడి చేయనున్నట్లు చిత్ర బృందం తెలియజేశారు.అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ఏప్రిల్ 9న విడుదల కాబోతోంది అంటూ దిల్ రాజు ప్రకటించారు.
ఈ నేపథ్యంలోనే మెగా హీరోల అందరి సినిమాల విడుదల తేదీని ప్రకటించడంతో మెగా అభిమానులు ఎంతో సంతోషంలో ఉన్నారు.అయితే ఈ సినిమాలో ప్రకటించిన తేదీలలో ఏవి విడుదల అవుతాయో ఏవి వాయిదా వేసుకుంటారనే విషయం పక్కన పెడితే ఇలా వరుసగా మెగా హీరోల సినిమాలు రావడంతో అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.కానీ మెగా కాంపౌండ్ లో మరొక హీరో, చిరంజీవి చిన్నల్లుడు నటించిన సూపర్ మచ్చి సినిమా గురించి మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు.ఈ సినిమా గురించి కనీసం ఒక ప్రమోషన్ లేదు, పోస్టర్ లేదు.
సూపర్ మచ్చి గురించి చిరంజీవి పట్టించుకోవడం లేదా? లేకపోతే కళ్యాణ్ దేవ్ సైలెంట్ గా ఉన్నారా? అనే విషయం గురించి మెగా అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.