మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి వారసులు మాత్రమే కాకుండా రెండో కూతురు భర్త కళ్యాణ్ దేవ్ కూడా విజేత సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు.మొదటి సినిమాతో పర్వాలేదనిపించుకున్న ఈ కుర్ర హీరో సూపర్ మచ్చి టైటిల్ తో రెండో సినిమా చేశాడు.
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుంది.రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో పులి వాసు దర్శకుడుగా పరిచయం అయ్యాడు.
ఇక సినిమాలో హీరోయిన్ గా కన్నడ స్టార్ హీరోయిన్ రచితా రామ్ నటించింది.ఈమెకి ఇదే మొదటి తెలుగు సినిమా కావడం విశేషం.
ఇదిలా ఉంటే రిలీజ్ తర్వాత చాలా వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.అయితే ఇప్పటికే చాలా తెలుగు సినిమాలు థియేటర్ల సమస్య కారణంగా ఓటీటీ బాట పట్టాయి.
ఇప్పుడు కళ్యాణ్ దేవ్ సూపర్ మచ్చి సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ చేయడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.ఇప్పట్లో థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయాలని అనుకున్నా ఆ టైంలో చాలా సినిమాలు పోటీలో ఉన్నాయి.తరువాత స్టార్ హీరోల సినిమాలు వరుసగా రిలీజ్ కాబోతున్నాయి.ఇవన్నీ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తే మరో ఆరు నెలలు రిలీజ్ వాయిదా పడిపోతుంది.పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ కాపీ కూడా ఇప్పటికే సిద్ధం కావడంతో నిర్మాతలు ఓటీటీని ఆశ్రయించారు.
ఇప్పటికే ఓ ఓటీటీ సంస్థ ఈ విషయంలో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.డీల్ ఫైనల్ కాగానే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది.
మొదటి సినిమాతో ఏవరేజ్ గా బయట పడ్డ మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ రెండో సినిమాతో ఎంత వరకు మెప్పిస్తాడు అనేది వేచి చూడాలి.