లాక్ డౌన్ సడలింపుల తర్వాత థియేటర్ లో అందరికంటే ముందుగా తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి.తెలుగు సినిమాలు వర్క్ అవుట్ అవడంతో మిగిలిన బాషల నిర్మాతలు ధైర్యం చేసుకొని తమ సినిమాలని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు.
అయితే థియేటర్స్ లో పెద్ద స్టార్ హీరోల సినిమాలకి తప్ప చిన్న సినిమాలు, లోబడ్జెట్ సినిమాలు చూడటానికి ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించలేదు.మంచి టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా కొన్ని ప్రేక్షకుల నుంచి స్పందన లేకపోవడంతో నష్టాలు చవిచూడాల్సి వచ్చింది.
అంతా కుదుటపడుతుంది అనుకున్న సమయంలో మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ ప్రజలని భయపెట్టడం మొదలు పెట్టింది.మొదటి సారికంటే మరింత గట్టిగా ఈ కరోనా కొత్త వేరియంట్ వైరస్ ప్రభావం చూపిస్తుంది.
దీంతో ప్రభుత్వం అప్రమత్తమై థియేటర్స్ ని మూసేసింది.దీంతో రిలీజ్ కి రెడీగా ఉన్న చాలా సినిమాల భవిష్యత్తు సందిగ్ధంలో పడింది.
ఈ సెకండ్ వేవ్ ప్రభావం ఎంత కాలం ఉంటుందో తెలియదు.అలా ని కంప్లీట్ అయిన సినిమాని రిలీజ్ చేయకుండా వదిలేస్తే నష్టాలు భరించాల్సి వస్తుంది.
ఈ కష్టాలన్నీ ఆలోచించుకొని చిన్న సినిమాలు అన్ని ఒటీటీ బాట పడుతున్నాయి.ఇప్పుడు మెగాస్టార్ చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన రెండో సినిమా సూపర్ మచ్చీ కూడా ఒటీటీలో రిలీజ్ కి రెడీ అయిపొయింది.
ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకోనున్న ఈ సినిమా రిలీజ్ చేయడానికి సరైన టైమ్ కోసం ఎదురుచూస్తున్నారు.అయితే మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ మొదలు కావడంతో మరి లాభం లేదనుకొని నిర్మాతలు ఒటీటీ రిలీజ్ కి మొగ్గు చూపించారు.
ఈ సినిమాని ఆహా ఒటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది.త్వరలో రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసే అవకాశం ఉంది.ఈ సినిమా ద్వారా కన్నడ బ్యూటీ రచితా రామ్ హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అవుతుంది.అలాగే పులివాసు దర్శకుడుగా పరిచయం అవుతున్నారు.