2018 సంవత్సరంలో దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహించినటువంటి విజేత అనే చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచమయ్యాడు మెగా స్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్.ఈ చిత్రంలో కళ్యాణ్ దేవ్ సరసన మాళవిక నాయర్ నటించింది.
అయితే ఈచిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడడంతో కళ్యాణ్ దేవ్ కి పెద్దగా కలిసి రాలేదు.దీంతో దీంతో కళ్యాణ్ దేవ్ మెగా ఇంటి నుంచి వచ్చినప్పటికీ సరైన హిట్ లేకపోవడంతో ప్రస్తుతం అతడిని పెద్దగా గుర్తించడం లేదు.
దీంతో కళ్యాణ్ దేవ్ తన తదుపరి చిత్ర విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
అయితే తాజాగా నూతన దర్శకుడు శ్రీధర్ సీపాన దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అంతేగాక ఈ చిత్రాన్ని జిఎ 2 పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అనే మూడు చిత్ర నిర్మాణ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.అయితే గతంలో వచ్చినటువంటి విజేత చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో కళ్యాణ్ దేవ్ తన ఆశలన్నీ ఈ చిత్రంపైనే పెట్టుకున్నాడు.
అయితే ఇది ఇలా ఉండగా అల్లుడు చిత్రం కోసం మెగాస్టార్ చిరంజీవి కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.అంతేగాక ఇప్పటికే నూతన దర్శకుడు శ్రీధర్ సీపాన కు స్క్రిప్ట్ విషయంలో పలు సూచనలు కూడా ఇచ్చాడట.ఈసారి ఎలాగైనా అల్లుడు కళ్యాణ్ తో హిట్ పట్టించాలని చిరంజీవి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు.