కళ్యాణ్ రామ్ హీరోగా కొత్త దర్శకుడు వశిష్ట్ డైరెక్షన్ లో తెరకెక్కిన బింబిసార సినిమా నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది.ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై 40 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా ట్రైలర్ గ్రాండ్ గా ఉండటం గమనార్హం.
ట్రైలర్ లోని చాలా షాట్స్ ప్రేక్షకులకు మగధీర సినిమాను గుర్తు చేస్తున్నాయి.ఫ్లాష్ బ్యాక్ లో బింబిసారుడిగా ప్రస్తుత కాలంలో మరో వ్యక్తిగా కళ్యాణ్ రామ్ కనిపించనున్నారు.
ట్రైలర్ లో కళ్యాణ్ రామ్ నట విశ్వరూపం చూపించారు.బింబిసారుడంటేనే మరణ శాసనం ఇక్కడ రాక్షసుడైనా భగవంతుడైనా బింబిసారుడు ఒక్కడే డైలాగ్ ట్రైలర్ కు హైలెట్ గా నిలిచింది.
నిధికి సంబంధించిన కథతో ఈ సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది.యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూస్తారా అని అదిరిపోయే డైలాగ్ చెబుతూ కళ్యాణ్ రామ్ మెప్పించారు.
ఈ ట్రైలర్ కు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.
కేథరిన్, సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు.
ట్రైలర్ గ్రాండ్ గా ఉండటంతో పాటు గత కొన్నేళ్లుగా కళ్యాణ్ రామ్ కోరుకున్న సక్సెస్ ఈ సినిమాతో దక్కడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కొత్త దర్శకుడు అయినప్పటికీ వశిష్ట్ అనుభవం ఉన్న దర్శకుడిలా ఈ సినిమాను తెరకెక్కించడం గమనార్హం.
కళ్యాణ్ రామ్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
సొంత బ్యానర్ లోనే సినిమాలను నిర్మించడానికి కళ్యాణ్ రామ్ ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం.కళ్యాణ్ రామ్ సినీ కెరీర్ లో సక్సెస్ సాధించిన సినిమాల కంటే ఫ్లాప్ అయిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి.అయితే టాలెంట్ ఉన్న హీరోగా గుర్తింపు ఉండటంతో కళ్యాణ్ రామ్ తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలు అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.