తం్రడి అధికారం లో ఉన్నప్పుడు అడ్డంగా దోచుకుని, దాచుకున్నది చాలక ప్రజలను మభ్యపెట్టేందుకు వైసీపీ నేతలు గడప, గడపకు వస్తున్నారని,
వారి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిమిడి కళావెంకటరావు హెచ్చరించారు.
శుక్రవారం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, జగన్ దోచుకున్న సొమ్ములే ఈడి జప్తు చేస్తోందని, ఈ విషయమై ప్రజలకు వివరణ ఇవ్వాలని ఆయన డిమాండు చేసారు.
తమ నేరాలకు క్షమాపణ చెప్పాకనే వైసీపీ ప్రజల్లోకి వెళ్లాలని అన్నారాయన.బెయిల్ కోసం సోనియా, కేసీఆర్తో కుమ్మక్కు అయిన జగన్ ఆం్రధప్రదేశ్ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకోవటమే ధ్యేయంగా పెట్టుకున్నాడని విమర్శంచారాయన.
కాంగ్రెస్నేతల గడప గడపకి వెళ్లి తమ పార్టీలో చేరాలని కోరేందుకే వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, దీని వైఎస్ మంత్రి వర్గంలో పని చేసిన బొత్సలాంటి నేతలు సారధ్యం వహిస్తున్నారని ఎద్దేవా చేసారాయన.