కాకినాడ నుండి హైదరాబాద్ వస్తున్న ఇంద్ర బస్సు ఇంజిన్ లో మంటలు వచ్చాయి.ఇంజిన్ నుండి మంటలు రావడం గుర్తించిన డ్రైవర్ వెంటనే ప్రయాణీకులను కిందకు దించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
బస్సులో మంటలు రావడంతో ఆందోళన పడ్డ ప్రయాణీకులు బస్సు దిగి సురక్షితంగా ఉన్నారు.వెంటనే ఫైర్ స్టేషన్ కు సమాచారం అందడంతో వెంటనే వచ్చి బస్సులోని మంటలను అదుపుచేశారు.
హైదరాబాద్ రావాల్సిన ఇంద్ర బస్సు కాకినాడ బస్టాండ్ నుండి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది.ఎండ తీవ్రత పెరగడం.ఇంజిన్ బాగా హీటెక్కడం వల్లే ఈ ఫైర్ యాక్సిడెంట్ కు కారణమని తెలుస్తుంది.అయితే ప్రమాదం జరిగినా ప్రయాణీకులకు ఎలాంటి నష్టం జరగలేదు.
డ్రైవర్ ముందుగా గమనించడం వల్ల పెద్ద ప్రమాదం నుండి బయటపడినట్టు తెలుస్తుంది.అదే డ్రైవర్ ఆ మంటలను చూడకుండా ఉంటే మాత్రం చాలా దారుణంగా ఉండేది.
బస్సులో ప్రయాణీకులు అంతా కూడా పెద్ద షాక్ కు గురయ్యారు.ఫైర్ సిబ్బంది కూడా వెంటనే రావడం వల్ల బస్సులోని మంటలను అదుపు చేసినట్టు తెలుస్తుంది.
అయితే సడెన్ గా ఇలా బస్సులో మంటలు ఎలా వచ్చాయి అసలు ఆ బస్సు కండీషన్ లోనే ఉందా లేదా అన్న విషయాలు తెలియాల్సి ఉంది.