కరోనా లాక్ డౌన్ పుణ్యమా అని డిజిటల్ ఎంటర్టైన్మెంట్ జోరు పెరిగింది.డిజిటల్ ఓటీటీ చానల్స్ ఎంటర్టైన్మెంట్ మార్కెట్ ని ఒడిసిపట్టుకోవడం కోసం విపరీతంగా వెబ్ సిరీస్, సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చాయి.
లాక్ డౌన్ టైంలో వినోదాన్ని అందించాయి.ఆదాయం బాగా పెరగడంతో భారీ బడ్జెట్ లతో అలా స్టార్ క్యాస్టింగ్ తో వెబ్ సిరీస్ లని తెరకెక్కిస్తున్నారు.
సినిమా అనేసరికి ఒకే రకమైన పాత్రలు చేయడానికి అవకాశం ఉంటుంది.అయితే వెబ్ సిరీస్ లు అయితే డిఫరెంట్ కాన్సెప్ట్ లతో వస్తాయి.
అలాగే ప్రేక్షకులు కూడా సినిమాని చూసినట్లు హీరో, హీరోయిన్స్ అనే యాంగిల్స్ లో చూడరు.కేవలం కథ, అందులో పాత్రలని మాత్రమే చూస్తారు.
ఈ నేపధ్యంలో నచ్చిన పాత్ర చేయడానికి కావాల్సినంత అవకాశం వెబ్ సిరీస్ లద్వారా దొరుకుతుంది.దాంతో పాటు మంచి రెమ్యునరేషన్ కూడా అందుతుంది.
ఈ నేపధ్యంలో స్టార్ సెలబ్రెటీలు కూడా ఓటీటీ బాట పడుతున్నారు.క్రైమ్ కథలతో, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో ప్రేక్షకులని మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.
ఇప్పుడు ఈ బాటలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, హీరో అజయ్ దేవగన్ భార్య కాజోల్ కూడా ఎంట్రీ ఇస్తుంది.ఇప్పటికే తన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి సినిమాలు చేసిన కాజోల్ ఇప్పుడు ఓ ఇంటరెస్టింగ్ స్టోరీతో డిజిటల్ లోకి అడుగుపెడుతుంది. నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కాబోయే ఈ వెబ్ సిరీస్ ని కాజోల్ భర్త అజయ్ దేవగన్ నిర్మిస్తూ ఉండటం విశేషం.త్రిభంగ టైటిల్ తో తెరకెక్కే ఈ వెబ్ సిరీస్ 1980 బ్యాక్ డ్రాప్ లో స్టార్ట్ అయ్యి ప్రెజెంట్ లో ముగుస్తుంది.
ఇందులో ఒకే కుటుంబంలో మూడు జెనరేషన్స్ కథని చెప్పబోతున్నట్లు తెలుస్తుంది.రేణుక సహానీ ఈ వెబ్ సిరీస్ తో దర్శకురాలిగా పరిచయం అవుతుంది.