బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ కాజోల్.బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయమైన కాజోల్ ప్రస్తుతం ఓ స్టార్ క్రేజ్ ని సంపాదించుకుంది.
ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది.ఇక మరో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ తో ప్రేమలో పడి కుటుంబ సమక్షంలో పెళ్లి చేసుకుంది.
ఆ మధ్య వీరిది సరైన జోడి కాదంటూ కొన్ని చర్చలు సాగాయి.
బాలనటిగా పరిచయం అయిన ఈ బ్యూటీ.
నటన, అందంతో హీరోయిన్ గా పరిచయం అయింది.మొదటి సినిమా బాజిగర్ తో మంచి విజయాన్ని అందుకుంది.
ఆ తర్వాత బాలీవుడ్ లో భూదార్ మే జిందగీ అనే సినిమాలో జితేంద్ర కి మనవరాలిగా నటించింది.అదే సినిమా తెలుగులో సీతారామయ్యగారి మనుమరాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే.
ఇక ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించింది.ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది కాజోల్.
ఎప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది.అంతేకాకుండా తన భర్త వ్యక్తిగత విషయాలు కూడా పంచుకుంటుంది ఈ బ్యూటీ.ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫోటో షేర్ చేయగా అందులో.మూతి తిప్పుతూ ఉన్న ఫన్నీ ఫోటో లో కనిపించింది కాజోల్.అంతేకాకుండా ‘ గత ఏడాది నుంచి నేను మాత్రమే ఇలా ఉన్నానా? ప్రపంచమంతా కూడా ఇలాగే ఆలోచిస్తుందా.?’ అంటూ ఫోటో కు క్యాప్షన్ ఇచ్చింది.
గత ఏడాది నుండి కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఈ విషయం గురించి స్పందించిన ఈ బ్యూటీ ప్రస్తుతం ప్రపంచ దృష్టి కోణం మారిందా అంటూ అభిమానులను ప్రశ్నించింది.ఇక దీనికి నెటిజనులు కాజోల్ ప్రశ్నకు స్పందిస్తున్నారు.ఇక ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లు వాయిదా పడిన సంగతి తెలిసిందే.