ప్రస్తుతం ఎక్కడ చుసిన డ్రగ్స్ కేసు ఏ వైరల్ అవుతుంది.బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ మరణం సినీ ఇండస్ట్రీని ఎలా గడగడలాడిస్తుందో చెప్పక్కర్లేదు.
బంధు ప్రీతి కారణంగానే సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని మొదట్లో వార్తలు వచ్చినప్పటికి ఆతర్వాత రియా చక్రవర్తి డబ్బు కాజేసిందని, డ్రగ్స్ అలవాటు చేసిందనే వార్తలు వచ్చాయ్. డ్రగ్స్ కేసు బయటకు రావడంతో కేవలం బాలీవుడ్ మాత్రమే కాదు శాండిల్ వుడ్, టాలీవుడ్ ఇలా అన్ని ఉలిక్కిపడ్డాయ్.
ఇక బాలీవుడ్ డ్రగ్ డీలర్లతో శాండిల్ వుడ్ కు కూడా సంబంధాలు ఉన్నాయని ఎన్సీబీ చెప్పడంతో బెంగుళూరు పోలీసులు కూడా అరెస్ట్ చేశారు.ఇప్పటికే హీరోయిన్ సంజనని, రాగిణి ద్వివేదిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే నటి సంజన బ్లడ్ శాంపుల్స్ తీసుకోగా యూరిన్ శాంపిల్ లో నీళ్లు కలిపింది.దీంతో ఆమెపై మరింత నిఘా పెట్టారు.
అయితే రియా చక్రవర్తిని అరెస్ట్ చేశాక రియా స్నేహితురాలైన రకుల్, సారా అలీఖాన్ కూడా డ్రగ్స్ తీసుకున్నారని వార్తలు వచ్చి నెట్టింట హాల్ చల్ చేశాయి.అయితే ఇప్పుడు మరో వార్త నెట్టింట వైరల్ అవుతుంది. అది ఏంటి అంటే? స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న సంజనతో కలిసి తీసుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇక ఆ ఫొటోలో కాసినోలో కాజల్ డబ్బులు పెడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది.
ఈ ఫోటో పాతది అయినప్పటికి కాజల్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు.కాజల్ ని కూడా డ్రగ్స్ కేసులో ఇరికించారు కదా! అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కానీ సంజన, కాజల్ కలిసి కేవలం కాసినో ప్రమోషన్స్ లో ఫోటో తీసుకున్నారు.తాప్సీ, తమన్నా, హన్సిక, జాక్వెలిన్ ఫెర్నాండెజ్లు కూడా ఆ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు.
సో.కాజల్ అభిమానులకు ఎటువంటి టెన్షన్ అక్కర్లేదు.