మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే.ఇప్పటికే 40 శాతం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది.
స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాలో చిరు సరికొత్త లుక్లో కనిపిస్తుండటంతో ఆయన ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా ఈ సినిమాలో తొలుత హీరోయిన్గా త్రిషను సెలెక్ట్ చేయగా, ఆమె ఈ సినిమా నుండి వాకౌట్ చేసింది.ఆ తరువాత వెంటనే భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ కాజల్ అగర్వాల్ను ఎంపిక చేశారు.
కానీ తాజాగా సోషల్ మీడియాలో కాజల్ కూడా ఈ సినిమా నుండి వాకౌట్ చేయడానికి రెడీ అయ్యిందంటూ వార్తలు వైరల్గా మారాయి.ఇది కాస్త ఆమె వరకు చేరడంతో కాజల్ మేనేజర్ ఈ వార్తలపై స్పందించారు.
కాజల్ ఈ సినిమా నుండి వాకౌట్ చేయడం లేదని, అవన్నీ కేవలం పుకార్లే అని కాజల్ మేనేజర్ అన్నారు.
దీంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆచార్య సినిమాకు ఇప్పటివరకు హీరోయిన్ కష్టాలు ఎదురైనా, ఇకపై ఎలాంటి కష్టాలు ఉండవని, చిత్ర షూటింగ్ నిర్విరామంగా జరిగి త్వరలో సినిమా రిలీజ్ కావాలని వారు కోరారు.కాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే.