టాలీవుడ్ చందమామ కాజల్, గౌతమ్ల వివాహం జరిగ వారం రోజులు అవుతుంది.అయినా నిన్నటి వరకు కూడా ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంది.
పెళ్లికి ముందు పెళ్లి తర్వాత పూజలు కార్యక్రమాల్లో ఇద్దరు బిజీ బిజీగా గడిపారు.నిన్నటికి నిన్న కూడా నూతన గృహ ప్రవేశం చేసిన కాజల్ దంపతులు సోషల్ మీడియాలో పూజా ఫొటోతో వైరల్ అయ్యారు.
కరోనా కారణంగా హనీమూన్ కార్యక్రమం ఏదీ పెట్టుకోలేదు.హనీ మూన్ లేకుండానే డైరెక్ట్ గా కాజల్ మరియు గౌతమ్లు హైదరాబాద్ కు రాబోతున్నారు.
హైదరాబాద్ కు ఎందుకు అనుకుంటున్నారా చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యేందుకు.ఔను ఈనెల 9వ తారీకు నుండి చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ పునః ప్రారంభించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.
కాజల్ ఈ సినిమా షూటింగ్ లో 12 లేదా 13వ తారీకు నుండి పాల్గొనాల్సి ఉంటుందని యూనిట్ సభ్యులు తెలియజేశారట.అందుకు కాజల్ ఓకే చెప్పింది.11వ తారీకున ఆమెతో పాటు గౌతమ్కు కూడా చిత్ర యూనిట్ సభ్యులు టికెట్ వేశారట.
కాజల్ రెగ్యులర్గా హైదరాబాద్ కు వస్తూ ఉంటుంది.
ఆమెతో పాటు కొన్ని సార్లు గౌతమ్ కూడా వచ్చాడు.అయితే ఆ సమయంలో ఎవరు గుర్తు పట్టలేదు.
పెళ్లి అయిన తర్వాత మొదటి సారి కాజల్ హైదరాబాద్ కు రాబోతుంది, ఆమె వెంట భర్త గౌతమ్ కూడా ఉండబోతున్నాడు.ఈ కొత్త జంటకు ఆచార్య టీం సాదరంగా ఆహ్వానం పలకబోతున్నారు.
దానితో పాటు కాజల్ దంపతులకు చిరంజీవి దంపతుల నుండి ఆశీర్వాదాలు అందబోతున్నాయి.అదే సమయంలో చిరంజీవి ఇంట కొత్త దంపతులకు వింధు ఏర్పాటు చేయడంతో పాటు బట్టలు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుందట.
మొత్తానికి చిరంజీవి మరియు సురేఖ దంపతుల నుండి కాజల్ దంపతులకు అతిథి సత్కారాలు అందబోతున్నాయి.ఆచార్య సినిమా షూటింగ్ లో పాల్గొంటునే హైదరాబాద్ లో సన్నిహితులకు గౌతమ్ ను పరిచయం చేసేందుకు పార్టీలకు కాజల్ హాజరు అయ్యే అవకాశం ఉందంటున్నారు.