ఒకప్పుడు వరుస సినిమాలతో టాలీవుడ్ లో బిజీ గా ఉన్న కాజల్ అగర్వాల్ కు అరుదైన గౌరవం లభించనుంది.దశాబ్దకాలం పాటు దక్షిణాదిన అగ్ర కథానాయిక గా కొనసాగిన కాజల్ లక్ష్మి కళ్యాణం చిత్రం తో టాలీవుడ్ లో అడుగుపెట్టింది.
అయితే ఆ చిత్రం పెద్దగా విజయాన్ని అందుకోకపోవడం తో వెంటనే కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ తో ఒక్కసారిగా కాజల్ రేంజ్ మారిపోయింది.
ఆ తరువాత దక్షిణాదిన అగ్ర హీరోలందరి సరసన కూడా నటించిన ఈ ముద్దు గుమ్మ సీనియర్ హీరో లు చిరంజీవి,కమల్ హాసన్ ల పక్కన కూడా నటించే అవకాశాలను పొందింది.
అయితే ఒకపక్క టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్నప్పుడే తమిళంలో కూడా బిజీ హీరోయిన్ గా మారడం తో కొంచం టాలీవుడ్ లో తగ్గించింది.అయితే కాజల్ కు ఇప్పుడు మరో అరుదైన గౌరవం లభించనుంది.
అదేంటంటే మేడమ్ టుస్సాడ్స్ లో కాజల్ మైనపు విగ్రహం కొలువుతీరానున్నట్లు తెలుస్తుంది.ఈ క్రమంలో కాజల్ మొహం కొలతలు కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది.
సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం లో కాజల్ మైనపు విగ్రహం త్వరలో కొలువుదీరనుంది.దీనితో ఈ ఘటన సాధించిన తోలి దక్షిణాది తార గా కాజల్ చరిత్ర సృష్టించనుంది.
ఇప్పటివరకు దక్షిణాదికి చెందిన హీరోయిన్స్ ఎవ్వరికీ కూడా ఇలాంటి గౌరవం దక్కలేదు.ఇక టుస్సాడ్స్ మ్యూజియం లో కాజల్ మైనపు బొమ్మ కొలువుదీరనుండడం తో ఈ ఘనత సాధించిన తోలి దక్షిణాది నటిగా కాజల్ పేరు నిలబడనుండి.వచ్చే ఏడాది ఫిబ్రవరి 20 వ తేదీన ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలుస్తుంది.