హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి పదమూడేళ్లకి పైగానే కెరియర్ పూర్తిచేసుకున్న టాలీవుడ్ అందాల బొమ్మ కాజల్ అగర్వాల్ ఇప్పటికి తన హవా కొనసాగిస్తుంది.స్టార్ హీరోలతో జతకడుతూ వరుస అవకాశాలు అందుకుంటుంది.
ఇప్పటికి కూడా వన్నె తగ్గని అందంతో, అభినయంతో కమర్షియల్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ గా కాజల్ ఉంది.ప్రస్తుతం ఆమె కమల్ హాసన్ కి జోడీగా భారతీయుడు సీక్వెల్ లో నటిస్తుంది.
ఇదిలా ఉంటే తనకి హీరోయిన్ గా మొదటి అవకాశం ఇచ్చిన గురువు తేజ దర్శకత్వంలో ఈ మధ్య ఎక్కువ సినిమాలు చేయడానికి కాజల్ ఒకే చెబుతుంది.ఆయన సినిమా అంటే మరోమాట లేకుండా ఒకే చెప్పేస్తుంది.
నేనే రాజు నేనే మంత్రి సినిమా గ్రాండ్ సక్సెస్ తో తన క్రేజ్ పెంచుకున్న తేజ ఇప్పుడు పెద్ద హీరోలతోనే వరుస సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు.
అందులో గోపీచంద్ హీరోగా అలివేలుమంగ వెంకటరమణ సినిమా చేస్తున్నాడు.
గోపీచంద్ సిటీమార్ పూర్తికాగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం దర్శకుడు తేజ క్యాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో ప్రస్తుతం ఉన్నాడు.
ఇక ఈ సినిమా కోసం కీర్తి సురేష్ పేరు మొదటి నుంచి వినిపిస్తుంది.అలాగే సాయి పల్లవి పేరు కూడా ఈ సినిమా కోసం వినిపించింది.అయితే ప్రస్తుతం వీరు వరుస సినిమాలకి డేట్స్ ఇచ్చేయడంతో ఈ సినిమా చేయడానికి డేట్స్ అడ్జస్ట్ కాలేదు.దీంతో చాలా మందిని చూసిన తేజ చివరికి తన ఆస్థాన హీరోయిన్ అయినా కాజల్ అగర్వాల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.
ఇక కాజల్ కూడా ఈ సినిమాలో గోపీచంద్ తో రొమాన్స్ చేయడానికి ఒకే చెప్పినట్లు సమాచారం.త్వరలో దీనికి సంబందించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ లో వినిపిస్తుంది.
.