ప్రస్తుతం టాలీవుడ్ నటి కాజల్ అగర్వాల్ తన అందంతో మరింతగా ఆకట్టుకుంటుంది.గత ఏడాది అక్టోబర్ 30న స్టార్ హోటల్ లో బిజినెస్ మెన్ గౌతమ్ కిచ్లూ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
అత్తారింటి అడుగుపెట్టాక కాజల్ అగర్వాల్ ఇక సినిమాల్లో నటించదన్న వార్తలు రాగా.అవన్నీ పుకార్లని తేలాయి.
ప్రస్తుతం కాజల్ అగర్వాల్ వరుస ఆఫర్లతో బిజీగా ఉంది.
ఇదిలా ఉంటే కాజల్ అగర్వాల్ తన పెళ్లి తర్వాత తన గ్లామర్ ను మరింత పెంచుకుంది.
సమంత కూడా తన పెళ్లి తర్వాత వయసు తో పాటు అందాన్ని పెంచుకుంటూ.సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫోటోలను, హట్ లుక్ లతో యువతను నిద్రపోకుండా చేస్తోంది.
ఇటీవలే కాజల్ అగర్వాల్ కూడా సమంత దారిలో నడుస్తుంది.సమంత లాగా తను కూడా అందంతో, ఫోటో షూట్ లతో యువతను బాగా ఆకట్టుకుంటుంది.
ఇక కాజల్ అగర్వాల్ తన మైనపు ప్రతిమని మొదటిసారిగా తన భర్తకే చూపించినట్టు తెలిపింది.ప్రస్తుతం త్రో బ్యాక్ ఫోటోలను షేర్ చేయగా.అందులో తన భర్త తో దిగిన ఫోటో అందరిని ఆకట్టుకుంది.సింగపూర్ లో కాజల్ అగర్వాల్ మైనపు ప్రతిమని ప్రతిష్ఠించగా.అది తయారు చేసే సంస్థ హౌస్ లో దిగిన ఫోటో షేర్ చేసింది.అందులో తన భర్త గౌతమ్ కిచ్లూ ఉండటం అందర్నీ ఆశ్చర్యపర్చగా.అప్పటికి కూడా తన ప్రేమ విషయాన్ని బయట పెట్టలేదు.
ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలో బ్లాక్ డ్రెస్ లో హాట్ లుక్ తో తెగ ఆకట్టుకుంది.
అంతేకాకుండా లైట్ గ్రీన్ డ్రెస్ లో తన అందంతో యువతను నిద్ర పోకుండా చేస్తుంది.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.
ఇదిలా ఉంటే కాజల్ ప్రస్తుతం ఆచార్య సినిమాల్లో బిజీగా ఉంది.అంతేకాకుండా మోసగాళ్ళు, ఇండియన్ 2, హే సినామిక, ముంబాయి సాగా వర్ష సినిమా షూటింగుల్లో బిజీగా ఉంది.