టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గత నెల 30వ తారీకున గౌతమ్ను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే.వీరిద్దరి పెళ్లి కరోనా కారణంగా సింపుల్గా చేసుకున్నారు.
నిశ్చితార్థం విషయం అస్సలు ఎవరికి తెలియకుండా చేసిన కుటుంబ సభ్యులు పెళ్లిని కూడా అతి తక్కువ మంది సమక్షంలో నిర్వహించారు.పెళ్లిని అత్యంత సన్నిహితుల సమక్షంలో చేసుకున్న కాజల్ దంపతులు రిసెప్షన్ను మాత్రం భారీగా హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ప్రచారం జరిగింది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సినీ మరియు మీడియా వర్గాల వారికి కాజల్ పెళ్లి ఆహ్వానం అందలేదు కనుక పెళ్లి రిసెప్షన్ కు వారిని ఆహ్వానించే అవకాశం ఉందని అంటున్నారు.
తాజాగా కాజల్ రిసెప్షన్ విషయమై స్పందిస్తూ హైదరాబాద్లో రిసెప్షన్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నాను.
కాని వచ్చే ఏడాది ఆరంభంలో రిసెప్షన్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కరోనా కారణంగా కాజల్ మరియు గౌతమ్ల వివాహంకు సంబంధించిన ఏర్పాట్లు నిరాడంబరంగా జరిగాయి.
ఇప్పుడు అదే కారణంగా పెళ్లి అయిన వెంటనే హైదరాబాద్లో ఏర్పాటు చేయాలనుకున్న రిసెప్షన్ ను ఆలస్యంగా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట.అందుకే కాజల్ రిసెప్షన్ కూడా ఆలస్యం చేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో వేడుకలు నిర్వహించవద్దంటూ ప్రభుత్వం పదే పదే హెచ్చరిస్తుంది.పైగా ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ మొదలు అవుతుందని కూడా అంటున్నారు.
అందుకే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశ్యంతో వచ్చే ఏడాదికి తన రిసెప్షన్ ను వాయిదా వేసేసింది.మరి ఆ తర్వాత ఏడాది అయినా ఈమె రిసెప్షన్ ఉంటుందా లేదా అనేది చూడాలి.
కాజల్ ఈనెల చివరి నుండి షూటింగ్ల్లో పాల్గొనబోతున్నట్లుగా చెప్పింది.పెళ్లి తర్వాత హనీమూన్ వెళ్లాలని అనుకున్నా కరోనా పరిస్థితుల కారణంగా దాన్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.