గత ఏడాది అక్టోబర్ 30న నటి కాజల్ అగర్వాల్ చిన్ననాటి స్నేహితుడైన గౌతమ్ కిచ్లుల వివాహం జరిగిన సంగతి మనకు తెలిసిందే.వీరి వివాహం జరిగి నాలుగు నెలలు అయినప్పటికీ వీరి దాంపత్య జీవితాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పవచ్చు.
ఇద్దరికీ కొంచెం సమయం దొరికితే చాలు రొమాంటిక్ డేట్స్, విహారయాత్రలు ప్లాన్ చేస్తుంటారు.ఈ క్రమంలోనే పెళ్లైన వారం రోజులకే హనీమూన్ కోసం మాల్దీవుల వెళ్ళిన ఈ జంట దాదాపు మూడు వారాల పాటు వారి హనీమూన్ ట్రిప్ ను ఎంతో ఎంజాయ్ చేశారు.
హనీమూన్ తర్వాత కాజల్ అగర్వాల్ తాను ఒప్పుకున్న సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే తాజాగా తన భర్త కిచ్లుతో కలసి ముంబైలోని ఓ స్టార్ హోటల్ కి డిన్నర్ డేట్ కి వెళ్లారు.
ఇక వారు డేట్ కి వెళ్ళిన సంగతి సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేస్తూ రెస్టారెంట్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.డేట్ నైట్ విత్ కిచ్లు అని కాజల్ అగర్వాల్ తన భర్త ఫోటో స్టేటస్ లో పెట్టగా, డేట్ విత్ గార్జియస్ వైఫ్ అంటూ కాజల్ అగర్వాల్ ఫోటోను కిచ్లు స్టేటస్ లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఒకవైపు పర్సనల్ లైఫ్ నూ, మరోవైపు ప్రొఫెషనల్ లైఫ్ ను ఎంతో బాలెన్స్ చేస్తూ తన దాంపత్య జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్న ఈ జంట మరెందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్న కాజల్ అగర్వాల్ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ఓ చిత్రంలో విష్ణు అక్క పాత్రలో కాజల్ అగర్వాల్ కనిపించనున్నారు.అదేవిధంగా లైవ్ టెలికాస్ట్ అనే వెబ్ సిరీస్ లో కాజల్ అగర్వాల్ నటించారు.హారర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమవుతుంది.