సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ కాజల్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటే అవుననే మాట ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది.ఆమె తన వివాహానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుందని టాక్ నడుస్తుంది.
చాలా కాలంగా కాజల్ అగర్వాల్ పెళ్లి గురించి సౌత్, బిటౌన్ లో ఆసక్తికర చర్చ నడుస్తుంది.అయితే తాను పెళ్లి చేసుకుంటే అందరికి చెప్పే చేసుకుంటా అని కాజల్ అగర్వాల్ అనేసి తప్పించుకుంటూ వస్తుంది.
ఆమె చెప్పుకున్న పెళ్లి తతంగం అంతా జరిగిపోతుంది అనే మాట ఇప్పుడు వెడ్డింగ్ సూత్ర అనే ఈవెంట్ ఆర్గనైజింగ్ కంపెనీ నుంచి బయటకి వచ్చింది.తాజాగా రానా పెళ్లి వేడుకని నిర్వహించింది కూడా ఇదే కంపెనీ కావడంతో ఇప్పుడు కాజల్ పెళ్లి హాట్ టాపిక్ అయ్యింది.
ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని ఆమె పెళ్లాడబోతున్నారు.
గృహాలంకరణ, టెక్ డిజైన్ కంపెనీ డిసర్న్ లివింగ్ వ్యవస్థాపకుడు, సీఈవోగా వ్యాపార రంగంలో ఇప్పటికే గౌతమ్ ఫేమస్ అయ్యాడు.
ఓ ఈవెంట్ సందర్భంగా వీరిద్దరూ కలుసుకున్నారని, అప్పటి నుంచి వీరి మధ్య పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చిందని తెలుస్తుంది.ముంబైలోని ఫైవ్ స్టార్ హోటల్లో పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం.
అయితే కరోనా సిచువేషన్ ఉంది కాబట్టి పెళ్లి వేడుకని సింపుల్ గా సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.పెళ్లి తర్వాత కూడా కాజల్ సినిమా కెరియర్ ని కొనసాగించే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్.
దీనికి కారణం ప్రస్తుతం ఆమె భారతీయుడు-2, ఆచార్య సినిమాలతో పాటు హిందీలోఒక సినిమా చేయాల్సి ఉంది.బాలీవుడ్, టాలీవుడ్ చిత్ర పరిశ్రమలకి చెందిన అతి కొద్ది మంది సెలబ్రెటీలు మాత్రమే ఈ పెళ్ళికి హాజరు కాబోతున్నారని టాక్.
అయితే ఈ వార్తపై కాజల్ అగర్వాల్ నుంచి మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు.