టాలీవుడ్ అందాల చందమామ కాజల్ అగర్వాల్ గత దశాబ్ధ కాలంగా వరుసబెట్టి సినిమాలు చేస్తూ తనదైన ముద్రను వేసుకుంది.దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ, తాను చేసే ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ వస్తోంది.
అయితే కాజల్ చేసిన మెజారిటీ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అవుతూనే వస్తున్నాయి.కాగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రంలో హీరోయిన్గా కాజల్ నటిస్తోంది.
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైనా కాజల్ మాత్రం ఇంకా షూటింగ్లో జాయిన్ కాలేదు.ఇక కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ అమలులో ఉండటంతో గత రెండు నెలలకు పైగా చిత్ర షూటింగ్లకు బ్రేక్ పడింది.
కాగా ఇటీవల షూటింగ్లకు అనుమతి లభించడంతో తమ సినిమా షూటింగ్ను మొదలుపెట్టేందుకు దర్శకనిర్మాతలు రెడీ అవుతున్నారు.ఈ క్రమంలోనే కాజల్ కూడా ఓ షూటింగ్ను ప్రారంభించినట్లు తెలుస్తోంది.
అయితే ఆమె చేస్తున్న షూటింగ్ టాలీవుడ్కు చెందిన సినిమాది కాదు.బాలీవుడ్లోనూ మంచి గుర్తింపు ఉన్న కాజల్, పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తూ వస్తోంది.
ఈ క్రమంలోనే ముంబైలోని ఓ స్టూడియోలో ఒక యాడ్ కంపెనీకి సంబంధించిన షూటింగ్లో కాజల్ పాల్గొంది.ఈ షూటింగ్లో పాల్గొన్నవారికి ఫేస్ మాస్కులు, చేతి తొడుగులు, పీపీఈ కిట్స్ అందించడమే కాకుండా సామాజిక దూరం పాటిస్తూ షూటింగ్ నిర్వహించారు.
ఇక కాజల్ ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టుల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.