ఈ మధ్య మన సౌత్ స్టార్ హీరోయిన్స్ ఒక్కొక్కరుగా ఒటీటీ వైపు అడుగులు వేసి అక్కడ ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.తమన్నా ఇప్పటికే ఒటీటీలోకి ఎంట్రీ ఇచ్చి రెండు వెబ్ సిరీస్ లు కంప్లీట్ చేసింది.
అలాగే కాజల్ అగర్వాల్ కూడా లైవ్ టెలికాస్ట్ అనే హర్రర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తో మెప్పించింది.త్రిష కూడా అదే బాటలో వెళ్తుంది.
అనుష్క కూడా వెబ్ సిరీస్ లకి రెడీ అవుతుందని తెలుస్తుంది.ఇలా కొత్తదనం, డిఫరెంట్ కాన్సెప్ట్ లు, డిఫరెంట్ రోల్స్ చేయడం కోసం స్టార్ హీరోయిన్స్ గా ఇండస్ట్రీని రూల్ చేసి ఇప్పుడు ఫేడ్ అవుట్ దశలో ఉన్న కథానాయికలు అందరూ కూడా డిజిటల్ ఎంట్రీ ఇచ్చేస్తున్నారు.
రీసెంట్ గా తమన్నా నవంబర్ స్టొరీ అనే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో నటించింది.ఇందులో మిడిల్ క్ల్రాస్ యువతిగా తండ్రిని హత్య నేరం నుంచి కాపాడుకోవడానికి తపించే పాత్రలో ఆకట్టుకుంది.ఈ వెబ్ సిరీస్ కి కూడా పాజిటివ్ టాక్ వచ్చింది.ఇదిలా ఉంటే కాజల్ అగర్వాల్ ఇప్పుడు తన రెండో వెబ్ సిరీస్ కి రెడీ అవుతుంది.
మొదటిది తమిళ్ లో చేసిన కాజల్ రెండో వెబ్ సిరీస్ మాత్రం స్ట్రైట్ తెలుగులో చేస్తుంది.పేపర్ బాయ్ సినిమాతో దర్శకుడుగా పరిచయం అయిన యంగ్ టాలెంటెడ్ జయశంకర్ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ ఈ వెబ్ సిరీస్ చేయబోతుంది.
క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తోనే ఫిమేల్ సెంట్రిక్ గా ఈ కథాంశం ఉండబోతుందని తెలుస్తుంది.లాక్ డౌన్ అనంతరం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ఆచార్య సినిమాతో పాటు కమల్ హసన్ ఇండియన్2 మూవీస్ లో నటిస్తుంది.ఈ రెండు షూటింగ్ దశలోనే ఉన్నాయి.
తాజా వార్తలు