సౌత్ సినిమాలలో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకొని ఏకంగా 13 ఏళ్ల కెరియర్ ని పూర్తి చేసుకున్న చందమామ కాజల్ అగర్వాల్ ఇప్పటికి తన బ్రాండ్ ఇమేజ్ ని అలాగే కొనసాగిస్తుంది.లాక్ డౌన్ టైంలో తన ప్రియుడు గౌతమ్ ని పెళ్లి చేసుకొని భార్యగా కొత్త జీవితం స్టార్ట్ చేసిన ఈ అమ్మడు పెళ్లి తర్వాత ఓ వైపు నటిగా చేస్తూనే మరో వైపు భర్తతో కలిసి వ్యాపారాలు మొదలు పెడుతుంది.
ఇప్పటికే భర్త వ్యాపారంలో భాగస్వామిగా మారిపోయిన ఈ అమ్మడు ఇప్పుడు సినిమాలలో కూడా పెట్టుబడులు పెడుతుందని తెలుస్తుంది.భర్తతో కలిసి సినిమా, వెబ్ సిరీస్ ల నిర్మాణంలో కూడా కాజల్ అగర్వాల్ ఎంట్రీ ఇస్తుందనే టాక్ ప్రచారంలో ఉంది.
అయితే ఇందులో వాస్తవం ఎంత అనే విషయంపై ఇప్పటి వరకు కాజల్ క్లారిటీ ఇవ్వలేదు.అయితే తాజాగా ఓ సినిమా నిర్మాణంలో ఆమె భాగస్వామ్యం అయ్యిందా అనే డౌట్ మరోసారి అందరికి క్రియేట్ అయ్యింది.
శివ కందుకూరి హీరోగా, మేఘా ఆకాష్ హీరోయిన్ గా మను చరిత్ర టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కింది.ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ ని చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది.భరత్ పి ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.ఇక ఈ పోస్టర్ లో కాజల్ కిచ్లూ ప్రెజెంట్స్ అని వేయడం జరిగింది.దీంతో ఈ సినిమా నిర్మాణంలో ఆమె కూడా భాగస్వామ్యం అయ్యిందనే టాక్ నడుస్తుంది.కోప్రొడ్యూసర్ గా ఆమె సినిమాలో పెట్టుబడులు పెట్టిందని, తరువాత పూర్తి స్థాయిలో ప్రొడక్షన్ హౌస్ ద్వారా వెబ్ సిరీస్ లు, సినిమాల నిర్మాణం చేసేందుకు చందమామ సిద్ధం అవుతుందని చర్చించుకుంటున్నారు.