టాలీవుడ్ అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవల తన పెళ్లి గురించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయడంతో ఆమె ఫ్యాన్స్తో పాటు పలువురు సెలబ్రిటీలు సంతోషం వ్యక్తం చేశారు.ఇక ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తడంతో కాజల్ ఉబ్బితబ్బిబవుతోంది.
కాగా ఆమె ముంబైకి చెందిన గౌతమ్ కిచ్లు అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించగా, కాజల్ పెళ్లి ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
కాగా ఈ బ్యూటీ అంగరంగ వైభవంగా ఏదైనా స్టార్ హోటల్లోనో లేక డెస్టినీ వెడ్డింగ్ అంటూ ఎక్కడైనా ఫారిన్లో జరుగుతుందని చాలా మంది అనుకున్నారు.
కానీ అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఈ బ్యూటీ తన పెళ్లిని సాదా సీదాగా ఇంట్లోనే జరుపుకునేందుకు రెడీ అవుతోంది.ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం నెలకొనడంతో ఈ వివాహవేడుకను చాలా కొంత మంది సన్నిహితుల మధ్య ఇంట్లోనే నిర్వహించాలని కాజల్ భావిస్తోంది.
ఈ మేరకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు కూడా చేస్తున్నారని తెలుస్తోంది.
ఏదేమైనా కరోనా ప్రభావంతో కాజల్ లాంటి స్టార్ హీరోయిన్ కూడా తన వివాహాన్ని ఇంటి వద్దే జరుపుకునే పరిస్థితి ఏర్పడింది.
ఇక కాజల్ లాంటి స్టార్ హీరోయిన్ పెళ్లి కూడా ఇలా నిరాడంబరంగా జరుగుతుండటంతో ఈ పరిస్థితులు ఇంకెన్నాళ్లు ఉంటాయా అని అందరూ అనుకుంటున్నారు.కాగా కాజల్ వివాహం తరువాత కూడా సినిమాల్లో నటిస్తానని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రంలో కాజల్ ప్రస్తుతం హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ కేమియో రోల్లో నటించనున్నాడు.