స్టార్ హీరోయిన్ గా సౌత్ ఇండియాలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి కాజల్ అగర్వాల్.ఏకంగా 12 ఏళ్ల పాటు తిరుగులేని ఇమేజ్ తో స్టార్ హీరోలకు జోడిగా ఆడిపాడిన ఈ అమ్మడు ప్రస్తుతం కూడా అదే స్పీడ్ ని కొనసాగిస్తుంది.
ప్రస్తుతం ఆచార్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి జోడీగా ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ నటిస్తుంది.ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.
అయితే కాజల్ అగర్వాల్ కు సంబంధించిన షూటింగ్ పార్ట్ ఇంకా మొదలు కాలేదు.దీంతో ఈ అమ్మడు ప్రస్తుతం వేరే సినిమాలో పెట్టుకోకుండా హ్యాపీగా భర్తతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడుతుంది.
తన సోషల్ మీడియాలో రెగ్యులర్ గా భర్తతో గడుపుతున్న జ్ఞాపకాలను కాజల్ అగర్వాల్ షేర్ చేసుకుంటుంది.
అదే పనిలో ఏ మాత్రం అవకాశం దొరికినా తన భర్తపై ప్రేమను చాటుకుంటూ పొగడ్తలు కురిపిస్తుంది.లాక్డౌన్ కాలంలో పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు వెంటనే మాల్దీవులు హనీమూన్ కి వెళ్ళిపోయింది.ఇండియా తిరిగి వచ్చిన తర్వాత భర్తతో కలిసి కొత్త ఇంటికి గృహ ప్రవేశం చేసిన ఈ భామ వీలైనంత ఎక్కువ సమయం భర్త గౌతమ్ కిచ్లూతో గడపడానికి ఇష్టపడుతుంది.
అలాగే అతని వ్యాపార భాగస్వామిగా మారిపోవడంతో అతని ఇంటీరియర్ ని ప్రమోట్ చేసే బ్రాండ్ అంబాసిడర్ గా కొత్త అవతారం ఎత్తింది.అయితే ఆచార్య సినిమా తర్వాత ఆమె మరో కొత్త సినిమా ఏదీకూడా అంగీకరించకపోవడంతో సినిమాలకి స్వస్తి చెప్పేస్తుందేమో అనే అనుమానం కలుగుతుంది.
గతంలో ఆమె కెరియర్ పై చేసిన కామెంట్స్ కూడా దీనికి బలం చేకూరుస్తున్నాయి.మరి కాజల్ అగర్వాల్ కెరియర్ ఆచార్య తర్వాత హౌస్ వైఫ్, బిజినెస్ విమెన్ గా ఉంటుందా, హీరోయిన్ గా కొనసాగుతుందా అనేది వేచి చూడాలి.