మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రం తరువాత స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు.దీనికి సంబంధించి ఇప్పటికే షూటింగ్ పనులు కూడా శరవేగంగా జరుపుకుంటోంది.
అయితే ఈ సినిమాలో హీరోయిన్గా అందాల భామ త్రిషను మొదట సెలెక్ట్ చేశారు చిత్ర యూనిట్.
కానీ తీరా షూటింగ్ మొదలయ్యాక తాను ఈ సినిమా నుండి వెళ్లిపోతున్నట్లు త్రిష ప్రకటించింది.
ఆమె ఈ సినిమా నుండి వెళ్లిపోవడానికి కారణాలను పక్కనబెడితే, ఆ దెబ్బతో చిరంజీవికి హీరోయిన్ను దొరకడమే పనిగా పెట్టుకున్నారు చిత్ర యూనిట్.ఈ క్రమంలో చాలా పేర్లు వినిపించాయి.
కానీ ఏ ఒక్కరు కూడా ఫైనల్ కాలేదంటూ చిత్ర యూనిట్ తెలిపింది.అయితే తాజాగా చిరు సినిమాలో నటించేందుకు ఓ స్టార్ బ్యూటీ ఓకే చేసినట్లు తెలుస్తోంది.
గతంలో మెగాస్టార్ రీఎంట్రీ చిత్రం ‘ఖైదీ నెంబర్ 150’లో హీరోయిన్గా నటించిన కాజల్ అగర్వాల్ను ఆచార్య సినిమాలో తీసుకున్నారట.దీనికి సంబంధించి కాజల్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసింది.
దీనికి సంబంధించి తన సోషల్ మీడియా అకౌంట్లో ఫ్యాన్స్కు ఈ విషయాన్ని కాజల్ తెలియజేసింది.దీంతో చిరు సరసన మరోసారి రొమాన్స్ చేసే అవకాశాన్ని కాజల్ కొట్టేసిందంటూ మెగా ఫ్యా్న్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.