సినీ పరిశ్రమలో 13 ఏళ్లుగా నటిగా కొనసాగుతూ తనదైన ముద్ర వేసుకుంది హీరోయిన్ కాజల్ అగర్వాల్.స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ అగ్ర కథానాయకులతో కలిసి ప్రేక్షకులను అలరించారు.
సినిమాల్లో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా పోస్టులు పెడుతూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది.అయితే ఈ ముద్దుగుమ్మ అరుదైన రికార్డులు సొంతం చేసుకుంది.
సినీ పరిశ్రమలో 13 ఏళ్లు సుధీర్ఘ ప్రయాణంతో ఒక రికార్డును సొంతం చేసుకుంటే, ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ సంఖ్య 15 మిలియన్లకు చేరడంతో మరో రికార్డును సొంతం చేసుకున్నారు. 15 మిలియన్ ఫాలోవర్స్ అంటే దాదాపు కోటిన్నర మంది కాజల్ అగర్వాల్ ను ఫాలో అవుతున్నారు.
అయితే కథానాయికల్లో ఇప్పటికే రుకుల్ ప్రీతి సింగ్ ఇన్ స్టాగ్రామ్ లో ముందంజలో ఉండగా.దీంతో కాజల్ కు సెకండ్ ప్లేస్ దొరికింది.
కాజల్ అగర్వాల్ ఇప్పటి వరకు తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమల్లో స్టార్ హీరోల సరసన నటించింది.2004వ సంవత్సరంలో మొదటి సారిగా ‘క్యూ హో గయా నా’ బాలీవుడ్ సినిమా ద్వారా వెండితెర ముందుకు వచ్చింది.తెలుగులో ఆమె మొదటి చిత్రం లక్ష్మీకళ్యాణం.మగధీర, డార్లింగ్, మిస్టర్.పర్ ఫెక్ట్, సింగం (హింది), గోవిందుడు అందరివాడేలే వంటి సినిమాకు బెస్ట్ ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కించుకున్నారు.జనతా గ్యారెజ్ సినిమాలో ‘పక్కా లోకల్’ ఐటమ్ సాంగ్ చేశారు.
సినీ పరిశ్రమలో తనదైన శైలి నటనతో అందరిని మెప్పిస్తోంది.
ప్రస్తుతం హీరోయిన్ కాజల్ అగర్వాల్ తెలుగు, తమిళ పరిశ్రమల సినిమాలతో బిజీగా ఉంది.
మెగాస్టార్ చిరంజీవి సరసన ‘ఆచార్య’ సినిమాలో కథానాయికగా నటిస్తోంది.మంచు విష్ణుతో ‘మోసగాళ్లు’, తమిళంలో కమల్ హాసన్ కు జోడిగా ‘ఇండియన్-2’లో నటించనున్నారు.
వీటితో పాటు ‘ముంబాయి సాగా, హే సినామికా, ప్యారిస్ ప్యారిస్’ వంటి సినిమాల్లో నటించనున్నారు.ఇన్ని బిజీ షెడ్యూల్ ల్లో కూడా అభిమానులకు దగ్గరగా ఉంటారు కాజల్.
ఎప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ అప్ డేట్లు, పోస్టులు పెడుతుంటారు.