లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టి స్టార్ హీరోల సినిమాల్లో వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు కాజల్ అగర్వాల్.పెళ్లి తర్వాత కూడా కాజల్ అగర్వాల్ కు కొత్త ఆఫర్లు వస్తున్నాయి.
పర్సనల్ లైఫ్ ను, ప్రొఫెషనల్ లైఫ్ ను బ్యాలన్స్ చేస్తూ కాజల్ కెరీర్ లో ముందుకు సాగుతున్నారు.ఆచార్య, ఇండియన్ 2 సినిమాలతో పాటు ప్రభుదేవా సినిమాలో కూడా కాజల్ నటించనున్నారని తెలుస్తోంది.
అయితే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాజల్ తన లైఫ్ కు సంబంధించి, ఇష్టాలకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు.తాను ఇతరులతో మాట్లాడే సమయంలో ఎప్పుడూ నవ్వుతూనే మాట్లాడతానని ఆమె పేర్కొన్నారు.
అదే సమయంలో కొందరితో మాట్లాడితే మాత్రం తనకు విపరీతమైన కోపం వస్తుందని పేర్కొన్నారు.నవ్వుతూ మాట్లాడే వారి వల్ల పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుందని.
ఎవరైనా అబద్ధం చెప్పినా, మోసం చేసినా మాత్రం కోపం వస్తుందని అన్నారు.
అబద్ధాలు చెబితే తాను సహించలేనని అవతలి వ్యక్తులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అబద్ధాలు చెప్పడం మాత్రం కరెక్ట్ కాదని కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు.
తనతో ఉండేవాళ్లు నిజాయితీతో ఉంటారని వాళ్లు తనతో అబద్ధం చెప్పే సాహసం కూడా చేయరని అన్నారు.మోసం చేసే వ్యక్తులను చూస్తే కోపం నషాళానికి అంటుతుందని ఆమె పేర్కొన్నారు.
అయితే ఇప్పుడు ఆ కోపం తగ్గించుకుంటున్నానని ఆమె తెలిపారు.
పెళ్లి తరువాత కాజల్ కు వరుస అవకాశాలు వస్తుండగా యంగ్ హీరోలతో పోలిస్తే సీనియర్ స్టార్ హీరోల సినిమాల్లో కాజల్ కు ఎక్కువగా అవకాశాలు వస్తుండటం గమనార్హం.
కెరీర్ మొదట్లో యంగ్ హీరోల సినిమాల్లో నటించిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు మాత్రం అవకాశాలను అందిపుచ్చుకుంటూ సినిమా ఆఫర్లు తగ్గకుండా జాగ్రత్త వహిస్తున్నారు.