కాజల్ అగర్వాల్ నేడు గౌతమ్ ను పెళ్లాడింది.ఆమె వివాహంకు కేవలం వంద మంది బంధు మిత్రులు మాత్రమే హాజరు అయ్యారు.
గత మూడు నాలుగు రోజులుగా ఆమె పెళ్లికి సంబంధించిన హడావుడి సోషల్ మీడియాలో కనిపిస్తుంది.నేడు కూడా పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పెళ్లి ఫొటోలను కాజల్ సన్నిహితులు రెగ్యులర్ గా షేర్ చేస్తున్నారు.ఇక సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న కాజల్ అగర్వాల్ సౌత్ నుండి పెళ్లికి ఏ ఒక్కరిని కరోనా కారణంగా పిలవలేక పోయింది.
అందుకే హైదరాబాద్ లో పెళ్లి తర్వాత పార్టీ ఏర్పాటు చేయాలని భావించింది.తమిళం మరియు తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన వారు ఆ పార్టీలో హాజరు అవ్వబోతున్నారు.
తమిళనాడు నుండి ఎక్కువ సంఖ్యలో సభ్యులు వచ్చేది ఉంటే మరో రోజు చెన్నైలో కూడా పార్టీ ఏర్పాటు చేసే అవకాశం ఉంది.వంద నుండి 150 మంది వరకు హాజరు అయ్యేలా హైదరాబాద్ లో రిసెప్షన్ కు ఒక ఫైవ్ స్టార్ హోటల్ను ఇప్పటికే బుక్ చేశారని మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. కాజల్ అగర్వాల్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా పుష్కర కాలం పాటు కొనసాగింది.ఇప్పటికి కూడా స్టార్ హీరోయిన్గా వెలుగు వెలుగుతోంది.ప్రస్తుతం చిరంజీవికి జోడీగా ఆచార్య సినిమాలో నటిస్తున్న కాజల్ మరో వైపు మంచు విష్ణు సినిమాలో కూడా నటిస్తుంది.తెలుగు మరియు తమిళ సినిమాల్లో నటించడంతో పాటు వెబ్ సిరీస్ లు ఇతర యాడ్స్ లో కూడా నటిస్తూ బిజీ బిజీగా ఉండే ఈ అమ్మడు ఇప్పుడు పెళ్లితో గౌతమ్కు జోడీ అయ్యింది.
పెళ్లి తర్వాత కూడా సినిమా చేస్తానంటూ ఇప్పటికే చెప్పిన కాజల్ వచ్చే నెల రెండవ లేదా మూడవ వారంలోనే ఆచార్య షూటింగ్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది.