ఒకప్పుడు తెలుగు సినిమా తారాలకి నటన తప్ప మరో విషయం తెలిసేది కాదు.రెమ్యునరేషన్ వ్యవహారం అంతా హీరోయిన్ కుటుంబ సభ్యులు చూసుకునే వారు.
ఈ కారణంగానే చాలా మంది హీరోయిన్స్ కెరియర్ ముగిసిన తర్వాత చేతిలో డబ్బులు లేక అవస్థలు పడిన కథలు చాలా చూసాం.చివరికి మహానటి సావిత్రి కథ కూడా ఇలాంటిదే.
డబ్బులు ఉన్నప్పుడు విచ్చలవిడిగగా ఖర్చు పెట్టి.తరువాత ఆర్ధిక ఇబ్బందులతో ఆమె ఎంత సతమతం అయ్యిందో అందరికి తెలిసిందే.
అయితే ఈ జెనరేషన్ హీరోయిన్స్ కి ఆ విషయంలో ఎవరు చెప్పాల్సిన పని లేదు.దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెత చాలాభాగా ఫాలో అవుతారు.
ఇలా ఫాలో అయ్యే భామలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ముందు వరుసలో ఉంటుంది.
కొద్ది రోజుల క్రితం కాజల్ అగర్వాల్ శ్రీలంకలో ఓ క్యాసినోలో సందడి చేసింది.
ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ నెల15 నుంచి రవితేజ హీరోగా తెరకెక్కే తెరి రీమేక్ లో నటించాల్సి ఉంది.
ఆ సినిమాకు కాల్ షీట్స్ ఇచ్చేసింది.కానీ ఆ సినిమా అనుకోకుండా క్యాన్సిల్ కావడంతో దొరికిన ఫ్రీ టైమ్ ని కూడా ఈ భామ సంపాదన కోసం వాడుకుంది.
దీంతో ఏప్రిల్ 13 న శ్రీలంకకు వెకేషన్ కోసం వెళ్ళి.అక్కడ బాలీస్ క్యాసినోలో కస్టమర్లతో కలిసి సందడి చేసి, కబుర్లు చెప్పింది.
ఇలా తమ కస్టమర్లతో గడిపినందుకు నిర్వాహకులు కాజల్ కి భారీగా డబ్బు ముట్టజెప్పారు.ఆ రోజు సింహళీయుల ఉగాది కావడంతో స్పెషల్ అకేషన్ గా ఆమెని ఇన్వైట్ చేయడంతో దొరికిన ఫ్రీ టైంని ఆమె అలా కాష్ చేసుకుంది.