ప్రపంచవ్యాప్తంగా మనుషులని వణికిస్తున్నటువంటి కరోనా వైరస్ గురించి ఇప్పటికే పలు స్టార్ హీరోలు మరియు హీరోయిన్లు దేశవ్యాప్తంగా స్పందిస్తున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా ఈ కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలు గురించి ప్రజలకి బాగానే అవగాహనా కలిపిస్తున్నారు.
అయితే ఈ కరోనా వైరస్ ప్రభావం ప్రస్తుతం నగరంలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించేటువంటి వారి కుటుంబాల పై బాగానే పడినట్లు తెలుస్తోంది.తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ సమస్యను హైలెట్ చేస్తూ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఓ పోస్ట్ ని షేర్ చేసింది.
అయితే ఇందులో ఇటీవల తాను ఓ పని నిమిత్తమై బయటికి వెళ్లేందుకు గాను క్యాబ్ ని బుక్ చేసుకున్నానని తనని కారులో ఎక్కించుకునేందుకు వచ్చినటువంటి కారు డ్రైవర్ ఒక్కసారిగా తనని చూసి ఏడ్చాడని చెప్పుకొచ్చింది.అయితే ఏమైందని క్యాబ్ డ్రైవర్ ని కాజల్ అడగ్గా గత రెండు రోజులుగా గిరాకీలు లేక రోడ్లపై ఖాళీగా తిరుగుతున్నానని అంతేకాక ఇప్పుడు కూడా తన కోసం కూడా దాదాపుగా 70 కిలోమీటర్లకు పైగా ఖాళీగా వచ్చానని చెప్పాడు.
అంతేగాక ఇటీవల కరోనా వైరస్ వల్ల రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారడంతో జనాలు బయటికి రావడం మానేశారని అందువల్ల తనకు గిరాకీలు లేక ఇంటికి కనీసం సరుకులు కూడా తీసుకెళ్ళ లేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశాడు.దీంతో అతడి వేదనను అర్థం చేసుకున్నటువంటి కాజల్ అగర్వాల్ తాను చెల్లించాల్సిన డబ్బు కి మరో 500 రూపాయలు కలిపి ఇచ్చిందట.ఈ విషయాన్ని షేర్ చేస్తూ కాజల్ అగర్వాల్ వెల్లడించింది.
అంతేగాక రోడ్లపై చిరు వ్యాపారాలు చేసుకునేవారు రోజువారి సంపాదనపై తన కుటుంబాలను నెట్టుకొస్తుంటారని కాబట్టి అలాంటి వారి దగ్గర ఏదైనా స్తువులు కొంటె వారికి వీలైనంత కొంచెం ఎక్కువ డబ్బులు ఇవ్వండి అంటూ తన అభిమానులను కోరింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కాజల్ అగవర్వాల్ ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్న టువంటి భారతీయుడు 2 అనే చిత్రంలో నటిస్తోంది.అలాగే మోసగాళ్లు అనే తెలుగు సినిమాల్లో కూడా నటిస్తోంది.