సీబీఐకి కడప ఎంపీ అవినాశ్ రెడ్డి లేఖ రాశారు.నోటీసుల్లో పేర్కొన్న విధంగా విచారణకు హాజరవుతున్నట్లు చెప్పారు.
మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో తన ప్రతిష్టను దెబ్బతీయడానికి కుట్రలు జరుగుతున్నాయని తెలిపారు.ఈ క్రమంలో అధికారుల విచారణ పారదర్శకంగా సాగాలని కోరుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
అదేవిధంగా విచారణ సమయంలో ఆడియో, వీడియో రికార్డింగుకు అనుమతించాలని కోరారు.తనతో పాటు న్యాయవాది ఉండేందుకు అనుమతి ఇవ్వాలని లేఖలో కోరారు.
కాగా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఆయన సీబీఐ ఎదుట విచారణకు హాజరుకానున్న విషయం తెలిసిందే.